Begin typing your search above and press return to search.

‘బీబీసీ’ని వదిలేదే లే.. వేల కోట్ల పరిహారం.. ట్రంప్ మొండిపట్టు

ప్రపంచంలోనే ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ వెంటపడ్డాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బీబీసీని మూసివేయడమా? లేక అంతటి భారీ పరిహారం ఇవ్వడమో ఏదో ఒకటి తేల్చేపనిలో పడ్డారు.

By:  A.N.Kumar   |   17 Dec 2025 2:00 AM IST
‘బీబీసీ’ని వదిలేదే లే.. వేల కోట్ల పరిహారం.. ట్రంప్ మొండిపట్టు
X

ప్రపంచంలోనే ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ వెంటపడ్డాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బీబీసీని మూసివేయడమా? లేక అంతటి భారీ పరిహారం ఇవ్వడమో ఏదో ఒకటి తేల్చేపనిలో పడ్డారు. అసలు కంపెనీ చెల్లించనంత పరిహారాన్ని కోట్ చేసి బీబీసీని మూసివేయించడానికి పెద్ద ప్లానే వేశారు. ఇప్పుడు బీబీసీకి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిని తగిలిన ఈ ఊహించని షాక్ నుంచి కోలుకోవడం కష్టంగా మారింది.

2021లో క్యాపిటల్ హిల్ పై దాడి జరిగిన సందర్భంలో తాను చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చి ప్రసారం చేసిందంటూ ట్రంప్ బీబీసీపై భారీ పరువు నష్టం దావా వేశారు.ఈ వివాదంపై ఆయన ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.90వేల కోట్లు) నష్టపరిహారం డిమాడ్ చేశాడు. ఇంత మొత్తం బీబీసీ వద్ద లేవు. సో సంస్థను మూసేయడమో.. లేదంటే జైలుకు పోవడమో చేయాలి.

ఎడిటింగ్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపణ

ట్రంప్ తరుఫు న్యాయవాదులు మియామిలోని ఫెడరల్ కోర్టులో 46 పేజీల దావాను దాఖలు చేశారు. 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్ పై తన మద్దతుదారులు దాడికి ముందు ట్రంప్ సుమారు గంటపాటు ప్రసంగించారు. అయితే బీబీసీ తన ‘పనోరమ డాక్యుమెంటరీ’లో ఈ ప్రసంగాన్ని రెండు చోట్ల ఉద్దేశ పూర్వకంగా సవరించినట్లు ట్రంప్ ఆరోపించాడు. తాను శాంతియుత నిరసనలకు మాత్రమే పిలుపును ఇచ్చానని.. కానీ బీబీసీ తన ప్రసంగాన్ని ఉద్వేగభరితంగా.. రెచ్చగొట్టే విధంగా మార్చిందని ట్రంప్ ఆరోపించాడు. ‘క్యాపిటల్ హిల్ కు వెళుతున్నాం.. మీతోపాటు నేనూ అక్కడికి వస్తున్నా.. మనం పోరాడుదాం.. ఘోరంగా పోరాడుదాం’ అన్నట్టుగా బీబీసీ ఎడిట్ చేసి ప్రసాం చేసింది. ఈ ఎడిటింగ్ ద్వారానే ప్రజలను తప్పుదోవ పట్టించారని ట్రంప్ ఆరోపించాడు. ఈ చర్యల ద్వారా బీబీసీ తన పరువుకు నష్టం కలిగించడంతోపాటు ఫ్లోరిడా చట్టాలను ఉల్లంఘించి అన్యాయమైన వ్యాపార విధానాలు పాటిస్తోందని ట్రంప్ దావాలో పేర్కొన్నారు. ఈ రెండు ఆరోపణలకు గాను ఒక్కొక్కదానికి 5 బిలియన్ డాలర్ల చొప్పున మొత్తం 10 బిలియన్ డాలర్లు నష్టపరిహారం కోరారు.

క్షమాపణ చెప్పినా తగ్గని ట్రంప్

2021లో బీబీసీ చేసిన ఈ తప్పుడు ప్రసారం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ట్రంప్ తరుఫు నుంచి వచ్చిన రాజకీయ ఒత్తిడి నేపథ్యంలోనే బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది. అయినా తగ్గని ట్రంప్ పరువు నష్టం దావా వేస్తానంటూ బెదిరించారు. దీంతో బీబీసీ చైర్మన్ సమీర్ షా స్వయంగా వైట్ హౌస్ కు ప్రత్యేకంా లేఖ రాశారు. ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేసిన అంశంలో తమ సంస్థతోపాటు తాను కూడా క్షమాపణలు చెబుతున్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు. తాము ఎడిట్ చేసిన ట్రంప్ ప్రసంగం తప్పుదోవ పట్టించే రీతిలో ఉన్నట్టు అంగీకరించారు. అంతేకాక ఈ వివాదాస్పద డ్యాక్యుమెంటరీని భవిష్యత్తులో మల్లీ తమ ఫ్లాట్ ఫామ్ లలో ప్రసారం చేసే ప్రణాళిక లేదని బీబీసీ స్పష్టం చేసింది. అయినా వెనక్కి తగ్గని ట్రంప్ తాజాగా పరువు నష్టం దావా వేశాడు.