Begin typing your search above and press return to search.

టిక్‌టాక్ బాబా కామెడీ.. భూకంపం వస్తుందని భయపెడితే పోలీసులు పట్టేశారు!

మయన్మార్‌లో పదే పదే భూకంపాలు వస్తాయని జోస్యం చెప్పడం బాబాకు తీవ్ర ఇబ్బందులను తీసుకొచ్చింది.

By:  Tupaki Desk   |   26 April 2025 6:00 AM IST
టిక్‌టాక్ బాబా కామెడీ.. భూకంపం వస్తుందని భయపెడితే పోలీసులు పట్టేశారు!
X

మయన్మార్‌లో పదే పదే భూకంపాలు వస్తాయని జోస్యం చెప్పడం బాబాకు తీవ్ర ఇబ్బందులను తీసుకొచ్చింది.మయన్మార్ పోలీసులు ఆ బాబాను అరెస్టు చేసి కఠినంగా శిక్షించనున్నట్లు తెలిపారు. ఆ బాబా పేరు జాన్ మో ద, ఇతను మయన్మార్‌లో ప్రముఖ జ్యోతిష్కుడిగా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. బాబాపై తీసుకున్న ఈ చట్టపరమైన చర్య మయన్మార్ అంతటా చర్చనీయాంశంగా మారింది.

ఇలెవెన్ మయన్మార్ మీడియా ప్రకారం.. జాన్ మో ద రోజూ భూకంప సూచనలకు సంబంధించి టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తుండే వాడు. చైనాకు చెందిన టిక్‌టాక్‌లో జాన్ మో దకు 3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. టిక్‌టాక్‌లో బాబా చెప్పే భవిష్యవాణి వీడియోలను చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫాలో అయ్యే వారు.

మయన్మార్ పోలీసుల ప్రకారం.. బాబా తన వీడియోల్లో ప్రజలు పగటిపూట పెద్ద పెద్ద భవనాల్లోకి వెళ్లవద్దని చెప్పేవాడు. బాబా జాన్ తన భవిష్యవాణిలో ప్రతిరోజూ పవర్ ఫుల్ భూకంపం వస్తుందని చెప్పడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు బాబా ఇచ్చిన డెడ్‌లైన్‌లను తప్పు అని కొట్టిపారేశారు. బాబా కేవలం అబద్ధాలు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని అన్నారు. ప్రజలను భయపెట్టి, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నాడనే ఆరోపణలపై బాబాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాబాను త్వరలోనే కోర్టుకు తరలిస్తారు.

జాన్ గతంలో ఒక నేరస్థుడు, అతనిపై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు నుంచి ఉపశమనం పొందిన తరువాత జాన్ టిక్‌టాక్‌లో వీడియోలు చేయడం ప్రారంభించాడు. ఇటీవలి భూకంపాల తర్వాత అతను రోజూ భవిష్యవాణి చెప్పేవాడు. వ్యూస్ సంపాదించడం కోసమే బాబా జాన్ ఇలా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇప్పుడు అతనిపై ఉన్న పాత కేసులన్నింటినీ ఓపెన్ చేసి చూస్తున్నారు. విచారణ అనంతరం అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మయన్మార్ ప్రజలు భూకంపాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకారం.. ఇటీవల సంభవించిన భూకంపాల కారణంగా మయన్మార్‌లో 3,700 మందికి పైగా మరణించారు. 60 వేల మందికి పైగా ఇప్పటికీ టెంట్లలో నివసిస్తున్నారు. భూకంప సూచనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తిరిగి తమ ఇళ్లకు వెళ్లడానికి భయపడుతున్నారు. శాస్త్రవేత్తలు మాత్రమే దీని గురించి మాట్లాడగలరని మయన్మార్ ప్రభుత్వం తెలిపింది. కాకపోతే శాస్త్రవేత్తలు కూడా భూకంపాలను అంచనా వేయలేరని వారు స్పష్టం చేశారు.