Begin typing your search above and press return to search.

లోకేశ్ కాబోయే సీఎం.. ఎమ్మెల్యే ఉగ్ర సంచలన వ్యాఖ్యలు

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పిసీ పల్లెలో బుధవారం రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు.

By:  Tupaki Desk   |   2 April 2025 8:43 AM
లోకేశ్ కాబోయే సీఎం.. ఎమ్మెల్యే ఉగ్ర సంచలన వ్యాఖ్యలు
X

ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ల శంకుస్థాపనకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ పై ప్రశంసలు కురిపించిన ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి లోకేశే ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేశేనంటూ ప్రకటించి కూటమిలో కల్లోలం రేపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారిస్తున్నా టీడీపీ ఎమ్మెల్యేలు తమ భావినేతపై ఇలాంటి ప్రకటనలు చేయడంపై జనసేనలో అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నారు.

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పిసీ పల్లెలో బుధవారం రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 65 వేల కోట్ల రూపాయలతో సీబీజే ప్లాంట్లు ఏర్పాటుకు రిలయన్స్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. దీనివల్ల రాబోయే రోజుల్లో 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. అంటే దాదాపు ఒక్కో ప్లాంటు వద్ద కనీసం 500 మంది పనిచేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా ఈ బయో గ్యాస్ ప్లాంట్లకు ఎందుకు పనికిరాని భూములను వాడుతుండటం కూడా రైతులకు ప్రయోజనంగా చెబుతున్నారు. రైతులకు నిరుపయోగంగా ఉన్న భూముల తీసుకుని ఏడాదికి 32 వేల రూపాయలు లీజు చెల్లించేలా రిలయన్స్ అంగీకరించింది. పూర్తిగా వ్యవసాయ వర్థాలుతో సీబీజీ ప్లాంట్లు పనిచేయడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనంగా చెబుతున్నారు.

ఇలాంటి ప్రాజెక్టును తాను అడగకుండానే మంత్రి లోకేశ్ చొరవతో కనిగిరి నియోజకవర్గానికి ఇవ్వడంపై ఉబ్బితబ్బిబైన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తన ఆనందాన్ని దాచుకోలేకపోయారు. పూర్తిగా వెనకబడిన తన నియోజకవర్గానికి భారీ ప్రాజెక్టు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి నారా లోకేశ్ తన వరకు తన నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా కీర్తించారు. తన నియోజకవర్గంలో ఇలాంటి సంబరం జరుపుకుంటానని ఊహించలేదని చెబుతూనే మంత్రి లోకేశ్ త్వరలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు.

ఎమ్మెల్యే ఉగ్ర వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. మరో పదేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కూటమిలోని ప్రధాన భాగస్వామి జనసేన ప్రకటిస్తుండగా, అందుకు విరుద్ధంగా టీడీపీ నేతలు కాబోయే సీఎం అంటూ లోకేశ్ పేరు ప్రచారంలోకి తేవడం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. గతంలో లోకేశ్ ను రెండో ఉప ముఖ్యమంత్రి చేయాలనే ప్రతిపాదనే పెద్ద దుమారం రేపింది. ఆ క్రమంలోనే దావోస్ లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి భరత్ కూడా లోకేశ్ కాబోయే సీఎం అంటూ ప్రకటించారు. ఆ వెంటనే మంత్రి భరత్ కు సీఎం చంద్రబాబు చీవాట్లు పెట్టి విషయం పెద్ది కాకుండా నివారించారు. అయితే ప్రభుత్వంలో నారా లోకేశ్ పాత్ర పెరుగుతుండటం, పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఆయన పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుండటంతో టీడీపీ శాసనసభ్యులు లోకేశ్ ను తమ భావినేతగా ప్రకటించేందుకు పోటీ పడుతున్నారని అంటున్నారు.