Begin typing your search above and press return to search.

యువ‌త‌కు ఛాన్స్‌.. సంచ‌లన నిర్ణ‌యం దిశ‌గా టీడీపీ ..!

టీడీపీలో యువ‌త‌కు పెద్ద పీట వేయాల‌న్న‌ది ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఎప్ప‌టినుంచో చెబుతున్నా రు.

By:  Tupaki Desk   |   24 April 2025 12:30 PM
TDPs Focus on Youth: Shifting Power and Age Limit Plans
X

టీడీపీలో యువ‌త‌కు పెద్ద పీట వేయాల‌న్న‌ది ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఎప్ప‌టినుంచో చెబుతున్నా రు. వీరి కోసం.. ఇటు పార్టీలో 33 శాతం ప‌దవులు రిజ‌ర్వ్ చేస్తామ‌ని కూడా అంటున్నారు. మ‌రోవైపు.. ప్ర‌భు త్వంలోనూ యువ‌త‌కు అవ‌కాశం క‌ల్పించేందుకు మంత్రులుగా తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌భుత్వం విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. పార్టీలో ముందుగా చ‌ర్య‌లు తీసుకుని.. త‌ద్వారా యువ‌త‌కు ప్రాధాన్యం ఇచ్చేదిశ‌గా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్న‌ట్టు సీనియ‌ర్ నాయ‌కులు చెబుతున్నారు.

ఏంటీ విధానం.?

ప్ర‌స్తుతం బీజేపీలో ఒక కీల‌క విధానం అమ‌లు చేస్తున్నారు. 75 ఏళ్లు నిండిన వ్య‌క్తులు, నాయ‌కుల‌కు కీల‌క ప‌ద‌వులు ఇవ్వ‌రాద‌ని.. యువ‌త‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌త్యేకంగా ఒక వింగ్‌ను ఏర్పాటు చేయాల‌ని క‌మ‌ల నాథులు భావించారు. ఈ క్ర‌మంలోనే 2020-21 మ‌ధ్య సీనియ‌ర్ నేత‌ల‌తో స‌ల‌హాదారులు, సంప్ర‌దిం పుల క‌మిటీ ఏర్పాటు చేశారు. దీనిలో 75 ఏళ్లు నిండిన వారిని చేర్చారు. వీరికి ప్ర‌త్య‌క్ష పాత్ర ఉండ‌దు. కానీ, స‌ల‌హాలు .. సూచ‌న‌లు చేయొచ్చు. ప్ర‌స్తుతం ఇది ఉంది.

ఇలానే.. టీడీపీలోనూ యువ‌త‌కు అవ‌కాశం ఇవ్వాలంటే.. 75 ఏళ్లు నిండిన వారిని ప‌క్క‌న పెట్టాల‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌గా ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న కూడా 75 ఏళ్ల‌కు చేరుకుంటున్నారు. అయితే.. అధ్య‌క్ష పీఠంపై ఉన్నారు కాబ‌ట్టి.. ఆయ‌న‌కు ఒక్క‌రికీ మిన‌హాయింపు ఉంటుంది. ఈ విష‌యాన్ని గ‌తంలో నారా లోకేష్ కూడా ప‌లు మార్లు చెప్పారు. త‌న‌తో స‌హా.. అంటూ.. సీనియ‌ర్ల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రెండేసి ప‌ద‌వులు ఉన్న‌వారిని ఒకే ప‌ద‌వికి ప‌రిమితం చేయ‌డం దీనిలో మ‌రో కీల‌క విష‌యం.

ప్ర‌స్తుతం రెండేసి ప‌ద‌వులు ఉన్న నాయ‌కులు కూడా ఉన్నారు. అలానే.. 75 ఏళ్లు నిండిన నాయ‌కులు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇలాంటి వారిని స‌ల‌హాలు-సంప్రదింపుల‌కు ప‌రిమితం చేసి.. యువ‌త‌కు ప్రాధాన్యం ఇచ్చే దిశ‌గా బ‌ల‌మైన కార్యాచ‌ర‌ణ‌ను రూపొందిస్తున్నారు. దీనిని మ‌హానాడు వేదిక‌గా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే.. దీనిని ఎంత మంది స్వాగ‌తిస్తారో చూడాలి. మ‌రీ ముఖ్యంగా సామాజిక వ‌ర్గాల‌ప‌రంగా కూడా దీనిని అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.