Begin typing your search above and press return to search.

స్కిల్ స్కాం కేసు... ప్రభుత్వానికి సుప్రీం కీలక ఆదేశాలు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసును క్వాష్ చేయాలంటూ చంద్రబాబు తరుపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్స్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో వాడీ వేడీ వాదనలు జరిగాయి

By:  Tupaki Desk   |   3 Oct 2023 9:14 AM GMT
స్కిల్  స్కాం కేసు... ప్రభుత్వానికి సుప్రీం కీలక ఆదేశాలు!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత 23 రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న చంద్రబాబు.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసును క్వాష్ చేయాలని కోరారు. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో తీవ్ర వాదనలు జరిగాయి.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసును క్వాష్ చేయాలంటూ చంద్రబాబు తరుపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్స్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో వాడీ వేడీ వాదనలు జరిగాయి. అయితే వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను సోమవారం (అక్టోబర్ 9) కు వాయిదా వేసింది.

అయితే… సీఐడీ పోలీసులు కస్టడీ అడుగుతున్నందున తక్షణమే రూలింగ్ ఇవ్వాలని బాబు తరుపు లాయర్లు కోరగా... ఆ విషయాన్ని అప్పుడే పరిగణలోకి తీసుకోలేమని బెంచ్ స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు ముందు బెయిల్‌ పిటిషన్‌ వేసుకోమని బాబు తరుపు న్యాయవాదులకు సూచించింది.

వాదనల అనంతరం స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం... ఈ కేసులో ప్రస్తుతానికి పరిశీలించాల్సిందేమీ లేదని చెబుతూ ఈ పిటిషన్‌ ను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది! ఇదే సమయంలో ఇరుపక్షాలు అప్పుడు డాక్యుమెంట్లు అన్నీ కోర్టుకు సమర్పించాలని తెలిపింది.

ఇదే సమయంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై కేవియట్‌ పిటిషన్‌ వేసిన రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలకు మద్ధతిచ్చే డాక్యుమెంట్లను సమర్పించాలని ఆదేశించింది.

అంతకు ముందూ బాబు క్వాష్ పిటిషన్‌ విచారణ సందర్భంగా.. సెక్షన్ 17ఏ చుట్టూనే తీవ్ర వాదనలు జరిగాయి. ఇందులో భాగంగా... 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు లాయర్లు వాదించగా.. వర్తించదని సీఐడీ తరపున లాయర్లు వాదించారు. కీలక వాదనల అనంతరం ధర్మాసనం క్వాష్ పిటీషన్‌ పై తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

కాగా... ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో చంద్రబాబు తరుపున నలుగురు లాయర్లు వాదిస్తున్నట్లు కోర్టుకి తెలిపారు. ఇందులో భాగంగా... సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీష్‌ సాల్వే ముందుగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు వినిపించారు. అనంతరం... లూథ్రా, సింఘ్వీలు ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు ఏపీ సీఐడీ తరపున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.