Begin typing your search above and press return to search.

షర్మిల కొడుకు వెడ్డింగ్ సెలబ్రేషన్స్...జగన్ ఎక్కడ...!?

ఫోటో షూట్ కార్యక్రమం కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన జరుగుతోంది.

By:  Tupaki Desk   |   17 Feb 2024 6:32 PM GMT
షర్మిల కొడుకు వెడ్డింగ్ సెలబ్రేషన్స్...జగన్ ఎక్కడ...!?
X

రాజస్థాన్ లోని జోద్ పూర్ లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఫోటో షూట్ కార్యక్రమం కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన జరుగుతోంది. ఈ కార్యక్రమాలలో వైఎస్సార్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా పాలుపంచుకున్నారు.


పెళ్లి కొడుకు రాజారెడ్డి, పెళ్ళి కుమార్తె తో పాటు వైఎస్ షర్మిల ఆమె భర్త అనిల్, వైఎస్ విజయమ్మ, అమ్మాయి వైపు తల్లితండ్రులు అంతా ఉత్సాహంగా ఫోటో షూట్ లో పాలుపంచుకున్నారు. అయితే ఒక్కటే లోటుగా కనిపిస్తోంది. వైఎస్ జగన్ అక్కడ లేకపోవడం.


సరిగ్గా నెల క్రితం ఇదే రోజున జరిగిన నిశ్చితార్ధపు వేడుకకు జగన్ దంపతులు హైదరాబాద్ వచ్చారు. వేదిక వద్దకే నేరుగా వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. ఇపుడు మేనల్లుడి పెళ్లి జోధ్ పూర్ లో జరుగుతోంది. ఈ పెళ్ళికి ముఖ్యమంత్రి జగన్ వస్తారా అన్న చర్చ అయితే చాలా కాలంగా ఉంది.

ఎందుకంటే ఏపీలో షర్మిల ప్రత్యర్ధిగా మారి వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. అదే టైం లో ఆమె జగన్ కి ప్రత్యర్థులుగా ఉన్న వారిని కలుస్తున్నారు. దాంతో పెళ్ళికి జగన్ దూరంగా ఉంటారు అని అంతా ముందే అనుకుంటూ వచ్చారు. ఇపుడు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో జగన్ కనిపించకపోవడంతో అదే నిజం అని అనుకుంటున్నారు.

అయితే ఈ పెళ్ళికి చాలా మంది రాజకీయ ప్రముఖులు హాజరవుతారు అని అంటున్నారు. వారంతా జగన్ తో ప్రత్యర్ధులుగా ఉంటూ వైరం సాగిస్తున్న వారే అని అంటున్నారు. దాంతో కూడా దూరంగా ఉండాలని జగన్ భావిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఈ పెళ్లికి హాజరవుతారా అన్న చర్చ కూడా నడుస్తోంది.