Begin typing your search above and press return to search.

షణ్ముఖ్ కోసం రంగంలోకి దిలీప్ సుంకర!

ఈ విషయాలపై మరింత వివరణ ఇచ్చిన దిలీప్ సుంకర... పోలీసుల కోణంలో మాత్రమే కేసు నమోదు చేశారని.. అయితే, ఈ విషయాలను కోర్టు నిర్ధారించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   23 Feb 2024 6:02 AM GMT
షణ్ముఖ్  కోసం రంగంలోకి  దిలీప్ సుంకర!
X

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అతడు గంజాయి తీసుకుంటున్నాడని.. అతని శరీరంలో గంజా పాజిటివ్ అని వైద్యపరీక్షల్లో తేలిందని కథనాలొచ్చాయి. దీంతో... వ్యవహారం మరింత సీరియస్ అవుతుందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో... షణ్ముఖ్‌ తరుపున ఈ కేసును వాదిస్తున్నట్లు న్యాయవాది దిలీప్ సుంకర తెలిపారు! ఈ సందర్భంగా మాట్లాడుతు కీలక విషయాలు వెల్లడించారు!

అవును... షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అతని సోదరుడిపై ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఒకెత్తు అయితే.. ఆ సమయంలో గంజాతో షణ్ముఖ్ దొరికడం.. వైద్య పరీక్షల్లో అతను గంజా సేవించినట్లు తెలిసిందనే కథనాలు రావడం మరొకెత్తు అయ్యింది! ఈ నేపథ్యంలో దిలీప్ సుంకర ఎంటరయ్యారు! ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రత్యక్ష సాక్షులు, షణ్ముఖ్ తండ్రి సమాచారం ప్రకారం ఈ కేసులో షణ్ముఖ్‌ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

ఇదే సమయంలో... యువతి ఫిర్యాదు మేరకు షణుంఖ్ అన్న సంపత్‌ వినయ్‌ కోసం మొదట పోలీసులు వచ్చారని.. సంపత్‌ అక్కడ లేకపోవడంతో విచారణలో పోలీసులకు షణ్ముఖ్‌ సహకరించలేదని.. దీంతో అతన్ని మరింత లోతుగా ప్రశ్నించేందుకు మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. మీడియాలో వస్తున్న ఇతర ఆరోపణలపై ఇంకా విచారణ జరగాల్సి ఉందని న్యాయవాది దిలీప్ సుంకర స్పష్టం చేశారు.

ఈ విషయాలపై మరింత వివరణ ఇచ్చిన దిలీప్ సుంకర... పోలీసుల కోణంలో మాత్రమే కేసు నమోదు చేశారని.. అయితే, ఈ విషయాలను కోర్టు నిర్ధారించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసే సమయానికి అతడు ఎలా ఉన్నారు.. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా వీరి ఇంటికి ఎవరెవరు వచ్చారు.. మొదలైన విషయాలు ఉంటాయని తెలిపారు.

ఆ యువతితో షణ్ముఖ్ సోదరుడు సంపత్‌ వినయ్‌ 2016 నుంచి ప్రేమలో ఉన్నాడని.. పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారని.. ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయని.. అయితే ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారని.. పెళ్లి సందర్భంగా సుమారు రూ. 40 లక్షల వరకు ఆ ఆమ్మాయి కోసం ఖర్చు పెట్టారని.. అందుకు సంబంధించిన ఆధారలు కూడా తమవద్ద ఉన్నాయని దిలీప్ సుంకర వెల్లడించారు.

ఈ సమయంలో ఆ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు షణ్ముఖ్ రూం కి వెళ్లారని.. అతనొక బ్యాచ్ లర్‌ కాబట్టి ఎంతోమంది అక్కడకు వస్తూ పోతుంటారని.. అది వారు షూటింగ్‌ కు కూడా ఉపయోగించే ప్రదేశమని.. ఈ క్రమంలో ఆ గంజాయి ఎవరిది అనేది పోలీసులు ఆధారాలతో సహా నిరూపించాల్సి ఉందని.. అందుకు షణ్ముఖ్ అన్నివిధాలా సహకరిస్తాడని అన్నారు. మీడియాలో వస్తున్న కథనాలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. కాగా... షణ్ముఖ్ కంపెనీకి గత నాలుగేళ్లగా దిలీప్‌ సుంకర లీగల్ అడ్వైజర్‌ గా ఉన్నారు!