Begin typing your search above and press return to search.

పాక్ టీం ని వెంటాడుతున్న నటి... ఆమె బాదంతా అదేనా?

అంటే... పరోక్షంగా భారత్‌ తో మ్యాచ్‌ లో పాక్‌ జట్టు కనీసం పోటీనివ్వలేకపోయిందనే ఉద్దేశంతో ఆమె తమ సొంతజట్టుపై పరోక్షంగా విమర్శలు చేసింది!

By:  Tupaki Desk   |   20 Oct 2023 9:48 AM GMT
పాక్  టీం ని వెంటాడుతున్న నటి... ఆమె బాదంతా అదేనా?
X

వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయి చాలా రోజులే అవుతున్నప్పటికీ... ఆ పరాజయం తాలూకు ప్రతిస్పందనలు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా... పాక్‌ నటి సెహర్ షిన్వారి మాత్రం అస్సలు జీర్ణించుకోవడం లేదు. ఇదే గ్యాప్ లో పాకిస్థాన్ క్రికెట్ టీంకు చురకలు వేస్తూనే ఉంది. పాకిస్థాన్ చేతిలో ఓడిపోనప్పటికీ... ఏదో ఒక టీం చేతిలో భారత్ ఓడిపోబోతోందా అని ఆమె వేయికళ్లతో ఎదురుచూస్తున్నట్లుంది.

అవును... ప్రపంచకప్‌ లో భారత్‌ పై బంగ్లాదేశ్‌ గెలిస్తే ఆ జట్టు క్రికెటర్‌ తో డిన్నర్‌ డేట్‌ కు వెళ్తానని ఇటీవల పాకిస్థాన్ సెహర్ షిన్వారి నటి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, గురువారం జరిగిన మ్యాచ్‌ లో భారత్‌ చేతిలో బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. దీంతో మరోసారి స్పందించిన ఆ నటి.. ఓడిపోయినప్పటికీ బంగ్లాదేశ్ ఆటను అభినందించింది. ఈ గ్యాప్ లో తమ సొంత జట్టు పాక్‌ పై మాత్రం పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది.

ప్రపంచకప్‌ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ పై భారత్ మరోసారి ఆధిపత్యం చలాయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పాక్ ని పసికూనను చేసిన భారత్ బంతాడేసింది. ఏ విషయంలోనూ పాకిస్థాన్ ది పైచేయి కాకుండా నిలువరించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన పాక్‌ అభిమానులు.. ప్రపంచకప్‌ లో భారత్‌ తదుపరి మ్యాచ్‌ ల్లో ఓడిపోవాలని కోరుకున్నారు. భారత్ ఓడిపోయే మ్యాచ్ కోసం వేయికళ్లతో చూస్తున్నారు.

ఈ క్రమంలోనే పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారి సంచలన ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... వచ్చే మ్యాచ్‌ లో బంగ్లాదేశ్ తమ ప్రతీకారాన్ని తీర్చుకోవాలని, ఆ జట్టు టీం ఇండియాను ఓడిస్తే ఢాకా వెళ్లి ఆ జట్టు క్రికెటర్‌ తో డిన్నర్‌ డేట్‌ కు వెళ్తానని తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. దీంతో ఇది కాస్తా వైరల్‌ ఇష్యూ అయ్యింది. అయితే ఈమె కోరిక నెరవేరలేదు. టీం ఇండియా... బంగ్లాను బంతాడేసుకుంది!

ఈ సమయంలో మరోసారి స్పందించింది సెహర్ షిన్వారి. ఇందులో భాగంగా... బంగ్లా ఆటగాళ్లు బాగా ఆడారని.. కనీసం భారత్‌ తో వారి సొంతగడ్డపై గట్టిగా పోరాడారని రాసుకొచ్చింది. అంటే... పరోక్షంగా భారత్‌ తో మ్యాచ్‌ లో పాక్‌ జట్టు కనీసం పోటీనివ్వలేకపోయిందనే ఉద్దేశంతో ఆమె తమ సొంతజట్టుపై పరోక్షంగా విమర్శలు చేసింది! దీంతో... ఈమె రియాక్షన్ మరోసారి వైరల్ అయ్యింది.

కాగా... పాకిస్థాన్ జట్టును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వెంటాడటం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఆసియా కప్‌ లో సూపర్‌-4 మ్యాచ్‌ లో భారత్‌ తో జరిగిన మ్యాచ్‌ లో పాక్‌ ఓటమిపాలైన అనంతరం ఇలాగే రియాక్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ఆ మ్యాచ్ లో ఓటమి అనంతరం... పాక్ కెప్టెన్ బాబర్‌ అజామ్‌, జట్టు సభ్యులపై కేసు పెడతానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.