Begin typing your search above and press return to search.

నిన్న సీమా.. నేడు సానియా... ప్రేమకోసం భారత్ కు!

ఇందులో భాగంగా తాజాగా ఏడాది వయసున్న తన కుమారుడిని తీసుకుని బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చింది సానియా అనే మహిళ!

By:  Tupaki Desk   |   22 Aug 2023 6:11 AM GMT
నిన్న సీమా.. నేడు సానియా... ప్రేమకోసం భారత్  కు!
X

ప్రేమకోసం బోర్డర్ దాటి ఒకరు వెళ్తుంటే... అదే ప్రేమ కోసం బోర్డర్ దాటి మరొకరు వస్తున్నారు. ఇప్పటికే ఫేస్ బుక్ లవ్ అంటూ అంజూ, పాకిస్థాన్ వెళ్లగా... పబ్ జీ లవ్ అంటూ పాక్ నుంచి సీమ, ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సానియా అనే మహిళ తెరపైకి వచ్చింది.

అవును... దేశ సరిహద్దులు దాటుతోన్న ప్రేమ కహానీల్లో తాజాగా మరో కొత్త స్టోరీ తెరపైకి వచ్చింది! ఇందులో భాగంగా తాజాగా ఏడాది వయసున్న తన కుమారుడిని తీసుకుని బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చింది సానియా అనే మహిళ!

వివరాళ్లోకి వెళ్తే... సానియా అఖ్తర్‌ అని చెబుతున్న మహిళ బంగ్లాదేశ్‌ నుంచి వీసా తీసుకుని భారత్ కు వచ్చింది. తన భర్త సౌరభ్‌ కాంత్‌ తివారిని కలుసుకునేందుకు వచ్చినట్లు చెబుతోంది. వీరిద్దరూ మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారట. వారికి ఒక కుమారుడు జన్మించాడు.

ఇప్పుడు సానియా తన కుమారుడిని తీసుకుని, సౌరభ్ కాంత్ ఉంటున్న నోయిడాకు వచ్చింది. అయితే ఆమె ఇక్కడకు వచ్చిన తర్వాత... భర్త మరో వివాహం చేసుకున్నాడని ఆమెకు తెలిసిందట. దీంతో... తన భర్త సౌరభ్‌ తనను మోసం చేసిన చేశాడని, అతడిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని చెబుతోంది!

అనంతరం ఆమె తన కుమారుడిని తీసుకుని సెక్టార్‌ 108లో ఉన్న పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి చేరుకుంది. తనకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను వేడుకుంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం సౌరభ్‌... తాను గర్భవతిగా ఉన్న సమయంలో ఒకరోజు .. తాను పని నిమిత్తం భారత్‌ కు వెళ్లి రావాల్సి ఉందని.. త్వరలో తిరిగి వస్తానని తనకు హామీ ఇచ్చాడని ఆ మహిళ పేర్కొంది. అయినా అతడు తిరిగి రాలేదని ఆమె తెలిపారు.

సౌరభ్ ఢాకాలోని కల్టీ మ్యాక్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌లో పని చేస్తున్నాడని సానియా తెలిపింది. సౌరభ్ తనతో కలిసి ఇండియాలో జీవించమని చెప్పినా.. బంగ్లాదేశ్‌ లో జీవించమని చెప్పినా తనకు ఎలాంటి అభ్యంత్గరం లేదని... తాను సౌరభ్‌ తో కలిసి జీవించాలని అనుకుంటున్నానని ఆమె తెలిపారు!

కాగా... ఫేస్‌ బుక్‌ లో పరిచయమైన వ్యక్తి కోసం మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌ కు చెందిన అంజూ అనే మహిళ.. పాకిస్థాన్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సీమా అనే మహిళ పబ్ జీ లో పరిచయమైన వ్యక్తి కోసం.. తన భర్తతో విడాకులు తీసుకుని, నలుగురు పిల్లలను వెంటబెట్టుకుని పాకిస్థాన్ నుంచి ఇండియాకు వయా దుబాయ్ వచ్చేసింది! ఇప్పుడు ఇలా దేశ సరిహద్దులు దాటిన ప్రేమకథలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.