Begin typing your search above and press return to search.

కేసీఆర్ దోస్తు ఆగవ్వకు ఇందిరమ్మ ఇల్లు.. ధావత్ ఇచ్చిన రేవంత్

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ "ఇది ప్రతిపక్షం లేదా పక్షం అనే భేదం లేదు. పేద ప్రజలకు సహాయం చేయడం ప్రభుత్వ ధర్మం.

By:  Tupaki Desk   |   19 Jun 2025 11:00 PM IST
కేసీఆర్ దోస్తు ఆగవ్వకు ఇందిరమ్మ ఇల్లు.. ధావత్ ఇచ్చిన రేవంత్
X

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. మాజీ సీఎం కేసీఆర్‌కు సన్నిహితురాలైన ఆగవ్వకు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంటి స్థలం పట్టా, లక్ష రూపాయల చెక్కును అందజేసింది.

యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొలి లబ్దిదారుగా ఎంపికైన ఆగవ్వకు ఆమె ఇంటి స్థలం పట్టాను, రూ. 1 లక్ష చెక్కును మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ "ఇది ప్రతిపక్షం లేదా పక్షం అనే భేదం లేదు. పేద ప్రజలకు సహాయం చేయడం ప్రభుత్వ ధర్మం. ఎవరు దోస్తో, ఎవరు శత్రువో చూసే సమస్య కాదు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికి అందించడమే మా లక్ష్యం" అని తెలిపారు.

ప్రత్యర్థి అయినప్పటికీ కేసీఆర్‌ దోస్త్‌కు ఇల్లు మంజూరు చేయడం ఇప్పుడు జిల్లాలో , రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. "రాజకీయాలు వేరే, ప్రజాపక్షం వేరే" అనే విషయాన్ని ఈ ఘటన మరోసారి రుజువు చేసినట్టైంది.

ఆగవ్వ మాట్లాడుతూ "కేసీఆర్‌గారు నాకు మంచి స్నేహితుడు. కానీ ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నాకు ఇల్లు ఇచ్చింది. నేను ఎవరికి నాయకుడో కాకుండా ప్రజానాయికుడిని. నాకు ఇల్లు రావడం నా అదృష్టం" అని పేర్కొన్నారు.

ఈ చర్యతో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం "ప్రజలందరికి సేవ" అనే సంకల్పాన్ని మరోసారి ప్రదర్శించినట్టు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. "ఇది మంచి పరిపాలనకి నిదర్శనం" అని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్ కు మరోరకంగా ఇదో ఝలక్ ఇచ్చినట్టైంది.