హైదరాబాద్ లో మిస్ వరల్డ్.. మరి భారత తొలి మిస్ వరల్డ్ ఎవరో తెలుసా?
ఒకరిద్దరు అందగత్తెలు ఒకచోట చేరితేనే చూపు తిప్పుకోలేం.. మరి 140 దేశాల నుంచి అందగత్తెలు వస్తే.. అందుకు మన హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇస్తే.. అదే మిస్ వరల్డ్ పోటీలు.
By: Tupaki Desk | 3 May 2025 4:07 PMఒకరిద్దరు అందగత్తెలు ఒకచోట చేరితేనే చూపు తిప్పుకోలేం.. మరి 140 దేశాల నుంచి అందగత్తెలు వస్తే.. అందుకు మన హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇస్తే.. అదే మిస్ వరల్డ్ పోటీలు. ఈ నెల 31న గ్రాండ్ ఫినాలే హైటెక్స్ లో జరగనుంది. భారత్ తరఫున రాజస్థాన్ కు చెందిన నందిని గుప్తా పోటీల్లో పాల్గొంటోంది.
ఇక భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటం నెగ్గిన వారిలో అత్యంత ప్రజాదరణ పొందినది ఐశ్వర్యారాయ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సినిమాల్లోకూ అడుగుపెట్టిన ఐశ్వర్య.. టాప్ హీరోయిన్ గా పదేళ్లకు పైగా కొనసాగింది.
1994లో ఐశ్వర్య మిస్ వరల్డ్ అయింది. అయితే, ఐశ్వర్య కంటే 28 ఏళ్ల ముందే భారత్ కు మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. 1951లో మిస్ వరల్డ్ పోటీలు ప్రవేశపెట్టగా, గోవాకు చెందిన రీటా ఫారియా 1996లోనే మిస్ వరల్డ్ టైటిల్ నెగ్గి భారత్ కు తొలిసారి టైటిల్ అందించింది.
ఇక 1994లో ఐశ్వర్య తర్వాత వెంటనే 1997లో డయానా హైడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2107లో మానుషి చిల్లర్ లు మిస్ వరల్డ్ లుగా ఎంపికయ్యారు.
అదే ఆమె ప్రత్యేకత..
ఐశ్వర్యతో పాటు అందరు మిస్ వరల్డ్ లు సినిమాల్లో నటించినవారే. మోడలింగ్ చేసినవారే. కానీ, రీటా ఫారియా మాత్రం అలా కాదు. 5 అడగుల 8 అంగుళాల ఎత్తు ఉండే రీటా.. 1966లోనే మిస్ బాంబే టైటిల్ కొట్టారు. అప్పట్లో ఆమె తలచుకుంటే ఎన్నో సినిమా అవకాశాలు వచ్చి వాలేవి. కానీ, రీటా మాత్రం ఒక్కటీ అంగీకరించలేదు. అలాగని రీటా మరీ సంప్రదాయవాది ఏమీ కాదు. 1960ల్లోనే స్విమ్ సూట్ వేసినంత అడ్వాన్డ్స్. అన్నిటికిమించి రీటా ఫారియా డాక్టర్. లండన్ లోని కింగ్స్ కాలేజీ నుంచి మెడిసిన్ పూర్తి చేసింది.
మరిప్పుడు ఎక్కడ ఉన్నారు..?
సరిగ్గా 59 ఏళ్ల కిందటే మిస్ వరల్డ్ టైటిల్ కొట్టిన రీటా ఫారియా ప్రస్తుతం 82 ఏళ్ల వయసులో ఐర్లాండ్ లో స్థిరపడ్డారు. ఇప్పటికీ.. ఆమెది చెరగని అందం..