Begin typing your search above and press return to search.

పశ్చాత్తాపడుతున్న రవీంద్ర జడేజా తండ్రి... సంచలన అరోపణలు!

క్రికెట్ గురించి పరిచయం ఉన్నవారికి టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి పరిచయం అవసరం లేదనే చెప్పాలి

By:  Tupaki Desk   |   9 Feb 2024 4:30 PM GMT
పశ్చాత్తాపడుతున్న రవీంద్ర జడేజా తండ్రి... సంచలన అరోపణలు!
X

క్రికెట్ గురించి పరిచయం ఉన్నవారికి టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ప్రస్తుతం టీం ఇండియాలో ఆల్ రౌండర్ గా అతడు సేవలందిస్తున్నాడు. అతడి భార్య గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రివాబా జడేజా అనేది తెలిసిన విషయమే. ఆ సంగతులు అలా ఉంటే... జడేజాపై అతని తండ్రి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఏకంగా... జడేజాను క్రికెటర్ ని చేసి తప్పు చేసినట్లు ఆయన చెబుతున్నారు.

అవును... టీం ఇండియా క్రికెటర్ రవీంద్ర జడేజాపై అతని తండ్రి అనిరుధ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... తన కొడుక్కి పెళ్లి చేసిన తర్వాత తమ మధ్య బంధం తెగిపోయిందని.. తన కోడలు వల్ల పెళ్లైన రెండు, మూడు నెలలకే వేరు కాపురం పెట్టి, తనను ఒంటరి వాడిని చేశారని జడేజా తండ్రి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన అనిరుధ్ సింగ్... రవీంద్ర, అతని భార్య రివాబాతో తన బంధం వారి పెళ్లైన రెండు మూడు నెలలకే తెగిపోయిందని అన్నారు. ఇదే సమయంలో... జడేజాకు పెళ్లి అయిన రెండు, మూడు నెలలకే గొడవలు మొదలయ్యాయని.. ఫలితంగా అప్పటి నుంచీ జామ్‌ నగర్ లో తాను ఒంటరిగా ఉంటుండగా.. జడేజా, అతని భార్యతో మరో ఇంట్లో ఉంటున్నాడని అన్నారు. ఇలా వేరు వేరు ఇళ్లల్లో ఉన్నా ఒకే ఊళ్లో ఉంటున్నప్పటికీ అతన్ని కలవడం లేదని.. ఈ విషయంలో అతని భార్య ఏం మాయ చేసిందో అర్థం కావడం లేదని అన్నారు.

ఇదే సమయంలో... జడేజాను తలచు కుంటే కడుపు రగిలిపోతుందని.. అతనికి పెళ్లి చేసి తప్పు చేశానని.. అసలు అతడు ఓ క్రికెటర్ కాకపోయి ఉంటే మరింత బాగుండేదని అంటున్నారు అనిరుధ్. అతడు క్రికెటర్ కాకపోయి ఉంటే... తమకు ఇప్పుడుఈ పరిస్థితి వచ్చేదే కాదని చెబుతున్నారు. పెళ్లయిన మూడు నెలలకే మొత్తం తన పేరు మీదికి మార్చాలని రవీంద్ర భార్య డిమాండ్ చేసిందని.. 50 మంది ఉన్న పెద్ద కుటుంబంలోనే ఆమె చిచ్చు పెట్టిందని అనిరుధ్ వాపోతున్నారు.

ఇదే క్రమంలో రవీంద్ర జడేజా కూతురు గురించి ప్రస్థావించిన అనిరుధ్ సింగ్... ఐదేళ్లుగా తన మనవరాలిని తాను చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జడేజా అత్తగారింటి వాళ్లే మొత్తం చూసుకుంటారని.. అన్ని విషయాల్లోనూ వాళ్లే జోక్యం చేసుకుంటారని.. వాళ్లకు జడేజా రూపంలో ఓ బ్యాంక్ దొరికిందని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో... ఇప్పుడు ఈ విషయాలు వైరల్ గా మారాయి!!