పుంగనూరు శాంతించిన వేళ.. !
పుంగనూరు.. ఈ పేరు వినగానే.. చెప్పగానే ఠక్కున స్ఫురణకు వచ్చే పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీ నాయకుడిగా.. ఆయన ఇక్కడ బలమైన కేడర్ను ఏర్పాటు చేసుకున్నారు.
By: Tupaki Desk | 27 May 2025 8:07 AMపుంగనూరు.. ఈ పేరు వినగానే.. చెప్పగానే ఠక్కున స్ఫురణకు వచ్చే పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీ నాయకుడిగా.. ఆయన ఇక్కడ బలమైన కేడర్ను ఏర్పాటు చేసుకున్నారు. మరో పార్టీ అంటూ లేకుండా కూడా చేయాలన్నది ఆయన ఉత్సాహం. వైసీపీ హయాంలో అచ్చంగా ఇలానే చేశారు. ఈ నేపథ్యంలోనే నాడు టీడీపీ కార్యకర్తలను, నాయకులను కూడా నిర్బంధించారు. కేసులు పెట్టారు. ఇంటి నుంచి బయటకు రాకుండా కూడా చేశారు.
అంతేకాదు.. ఎక్కడా వైసీపీ జెండా.. ఆ పార్టీ రంగులు తప్ప.. మరో రంగు కనిపించకుండా పెద్దిరెడ్డి అను చరులు జులుం ప్రదర్శించారని టీడీపీ నాయకులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా అప్పటి విపక్ష నాయకుడు చంద్రబాబు పర్యటనను అడ్డుకుని అంగళ్ల సెంటర్లో రాళ్లదాడికి కూడా పాల్పడ్డారు. ఈ పరిణామాలు ఒకవైపు అయితే.. ఎక్కడో సిక్కోలు నుంచి సైకిల్ యాత్రపై వచ్చి.. కుప్పానికి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను కూడా నిర్బంధించి.. వారిని అవమానించారు.
ఈపరిణామాలు అప్పట్లో తీవ్ర అలజడిని రేపాయి. అయినా.. పెద్దిరెడ్డి ఏమాత్రం సంకోచించలేదు. ఇష్టా రాజ్యంగానే వ్యవహరించారని టీడీపీ నాయకులు చెబుతారు. దీంతో పరిస్థితుల మార్పు కోసం.. ఇక్కడ పార్టీ నేతలు.. ఎదురు చూశారు. కలసి కట్టుగా పనిచేశారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం పోయి.. టీడీపీ వచ్చింది. ఇక, ఇప్పుడు పుంగనూరు పరిస్థితి ఎలా ఉందంటే.. ఎటు చూసినా..పసుపు వర్ణ శోభితమైంది. ప్రతి కార్యకర్త ఇంటిపైనా.. పసుపు జెండా ఎగురుతోంది.
మహానాడును పురస్కరించుకుని పుంగనూరులో ప్రత్యేకంగా పార్టీ జెండాను నడివీధిలో ఎగురవేశారు. కార్యకర్తలు, నాయకులు వారి ఇళ్లకు కూడా పసుపు జెండాలు తోరణాలుగా కట్టుకున్నారు. అంతేకాదు.. సిక్కోలు కార్యకర్తలను ఎక్కడైతే.. అవమానించారో.. అక్కడి నుంచే సైకిల్ యాత్ర చేపట్టి మహానాడుకు బయలుకు దేరారు. దీంతో పుంగనూరు టీడీపీ కార్యకర్తల్లో గూడు కట్టుకున్న ఆవేదన, ఆందోళన తొలిగిపోయి.. శాంతించారు.