Begin typing your search above and press return to search.

బిగ్ న్యూస్... భారత్ లో 15 చోట్ల దాడికి పాక్ యత్నం!

అవును... భారత్ లోని 15 నగరాల్లో సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించింది.

By:  Tupaki Desk   |   8 May 2025 10:23 AM
బిగ్  న్యూస్... భారత్  లో 15 చోట్ల దాడికి పాక్  యత్నం!
X

ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ ప్రతీకార చర్యకు సిద్ధమవుతుందనే సంకేతాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... జమ్మూకశ్మీర్, పంజాబ్, గుజరాత్, శీనగర్, అమృత్ సర్, లుథియానా, చండీగఢ్ సహా పలు నగరాల్లో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులకు ప్రయత్నించగా.. భారత్ సక్సెస్ ఫుల్ గా అడ్డుకుందని జాతీయ మీడియా తెలిపింది.

అవును... భారత్ లోని 15 నగరాల్లో సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా చైనాకు చెందిన బీవీర్ మిస్సైల్స్ తో దాడులు చేసేందుకు యత్నించింది. దీన్ని భారత్ లోని ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. పాక్ ప్రయత్నాన్ని సక్సెస్ ఫుల్ గా తిప్పికొట్టింది. దీంతో... పాక్ యుద్ధానికి సిద్ధమైనట్లేనని నిపుణులు అంటున్నారు.

ఇలా భారత సాయుధ దళాలు పాక్ లోని నాలుగు ఉగ్రవాద శిబిరాలు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఐదు ఉగ్రవాద శిబిరాలపై కచ్చితమైన దాడులు నిర్వహించిన ఒక రోజు తర్వాత భారత్ పై సైనిక చర్యకు పాక్ ప్రయత్నించడం గమనార్హం. ఈ సందర్భంగా భారత్ ధ్వంసం చేసిన పాక్ డ్రోన్లు, క్షిపణుల శిథిలాలను సేకరిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.

మరోపక్క నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ జరిపిన భారీ ఫిరంగి, మోర్టార్ దాడుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పిల్లలు సహా 16 మంది పౌరులు మరణించారని ప్రభుత్వం తెలిపింది. ఇక్కడ కూడా పాక్ మోర్టార్, ఫిరంగ్ కాల్పులను ఆపడానికి భారత్ స్పందించిందని ఒక ప్రకటనలో తెలిపింది!

అమృత్ సర్ పరిసరాల్లో మిస్సైల్ శకలాలు!:

పంజాబ్ లోని అమృత్ సర్ పరిసరాల్లో మిస్సైల్ శకలాలు లభ్యం కావడం కలకం రేపింది. అయితే... 15 నగరల్లో పాక్ దాడులకు యత్నించిన నేపథ్యంలోనే ఇది జరిగింది. ఈ మిస్సైల్ ను భారత్ గాల్లోనే ధ్వంసం చేసింది. యాంటీ మిస్సైల్ వ్యవస్థ ద్వారా పాక్ ప్రయత్నాలను భారత్ సక్సెస్ ఫుల్ గా అడ్డుకుంది. ఖాగా పంజాబ్ లో హైఅలర్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే!