Begin typing your search above and press return to search.

స్త్రీలను అవమానిస్తే యుద్ధం తప్పదు.. శ్రీకృష్ణుడి మాటే నిజమైందా?

కొద్ది రోజుల క్రితం పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

By:  Tupaki Desk   |   9 May 2025 5:30 PM
Where Women Are Dishonored War Is Inevitable Netizens React
X

‘‘స్త్రీలకు ఎక్కడ అవమానం జరుగుతుందో, అక్కడ యుద్ధం తప్పకుండా వస్తుంది. ఏదో ఒక రూపంలో మహాభారతం మళ్లీ మొదలవుతుంది’’అని శ్రీకృష్ణుడు మహాభారతంలో చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు భారతీయ స్త్రీల బొట్టు చెరిపి, వారికి దుఃఖాన్ని మిగిల్చారని, అందుకే పాకిస్తాన్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోందని మండిపడుతున్నారు. "యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః" (ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు నివసిస్తారు) అనే శ్లోకాన్ని గుర్తు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడిలో ఉగ్రవాదులు భారతీయ స్త్రీలను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకున్నారని, వారి బొట్టు చెరిపి వారికి శోకాన్ని మిగిల్చారని వార్తలు వచ్చాయి. ఇది దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. స్త్రీలను అవమానించడం భారతీయ సంస్కృతికి విరుద్ధమని ఇది ఎప్పటికీ క్షమించరాని చర్య అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను నెటిజన్లు సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు. ద్రౌపదికి జరిగిన అవమానం మహాభారత యుద్ధానికి ఎలా కారణమైందో వివరిస్తున్నారు. స్త్రీలను అవమానిస్తే దాని ఫలితం యుద్ధమేనని అంటున్నారు. పహల్గాంలో స్త్రీలకు జరిగిన అవమానం కూడా పాకిస్తాన్‌కు శాపంగా మారిందని, ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాలకు ఇదే కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయంగా ఒంటరిగా మారడం వంటి పరిస్థితులను వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులకు మద్దతు తెలుపుతున్న పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.