పారిపోయిన పాక్ ప్రధాని? ఇస్లామాబాద్ నివాసం దగ్గర ఏం జరిగింది?
చేతులారా నాశనాన్ని కొని తెచ్చుకోవటం ఎలా ఉంటుందో ప్రపంచానికి తన తీరుతో అర్థమయ్యేలా చేశారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ఫరీష్.
By: Tupaki Desk | 9 May 2025 9:19 AM ISTచేతులారా నాశనాన్ని కొని తెచ్చుకోవటం ఎలా ఉంటుందో ప్రపంచానికి తన తీరుతో అర్థమయ్యేలా చేశారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ఫరీష్. గురువారం రాత్రి భారత్ లోని సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులతో పాటు వైమానిక దాడులకు తెగబడిన పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాక్ దాడుల్ని భారత ఆర్మీ సమర్థంగా తిప్పి కొట్టటమే కాదు.. పాక్ కు భారీ నష్టం వాటిల్లేలా చేసింది.
ఓవైపు తన మీద జరిగే దాడుల్ని తిప్పి కొట్టి.. నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్న భారత్.. అదే సమయంలో పాక్ పీచమణిచేలా ఆ దేశంలోని పలు ప్రాంతాల్ని టార్గెట్ చేసింది. అందులో పాకిస్తాన్ ప్రధానమంత్రి నివాసం ఉండే ఇస్లామాబాద్ మీదా దాడి చేసింది. అనూహ్య రీతిలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నివాస స్థలానికి కాస్త దూరంలో భారత సైన్యం జరిపిన దాడికి పాక్ ప్రధానమంత్రితో సహా.. పాక్ సైన్యం ఉలిక్కిపడింది.
ఇస్లామాబాద్ లక్ష్యంగా భారత డ్రోన్లు.. మిస్సైల్ లతో దాడికి దిగింది. దీంతో ఒక్కసారిగా అలెర్టు అయిన పాకిస్తాన్.. తన ప్రధానమంత్రిని ఇంటి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా చెబుతున్నారు. యుద్దాన్ని తనకు తానుగా ఆహ్వానించి.. తీరా తన ముంగిట్లోకి వచ్చిన వేళ.. ఇంటి నుంచి పారిపోయిన పాక్ ప్రధాని.. సురక్షిత ప్రాంతంలో తలదాచుకున్నట్లుగా చెబుతున్నారు.
మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు దన్నుగా నిలిచేలా భారత నౌకాదళం పాకిస్థాన్ అర్థిక రాజధాని కరాచీ సముద్ర పోర్టుపై ప్రతీకార దాడులకు పాల్పడింది. ఐఎన్ఎస్ విక్రాంత నుంచి మిస్సైల్స్.. డ్రోన్లను ప్రయోగించింది. ఈ క్రమంలో పోర్టులో ఏడు భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో.. భారీగా మంటలు ఎగిసిపడిన పరిస్థితి. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కరాచీపోర్టులో మొత్తం పది పాక్ కార్గో నౌకలు ధ్వంసమైనట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. పలు షిప్పులు కూడా ధ్వంసమయ్యాయని.. అరేబియా సముద్రంలో పాక్ వైపు గురి పెట్టిన భారత నావికాదళం మొత్తంగా 26 యుద్ధ నౌకలతో విరుచుకుపడుతూ దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.