Begin typing your search above and press return to search.

'సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే'... పాక్ ఎంపీ వీడియో వైరల్!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 May 2025 4:25 PM IST
సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే... పాక్  ఎంపీ వీడియో వైరల్!
X

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. పాక్, పీవోకే లోని 9 ఉగ్రస్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో 100 మందికిపైగా ఉగ్రవాదులను అంతమొందించింది. అయితే... ఈ దాడితో ఉక్కిరిబిక్కిరి అయిన పాక్.. భారత్ పై క్షిపణులతో దాడికి తెగించింది.

నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.. భారత్ సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్, క్షిపణులను ప్రయోగించింది. అయితే.. ఆ ప్రయత్నాలను భారత రక్షణ వ్యవస్థలు తిప్పికొట్టాయి. అనంతరం... పాక్ ని భారత్ వణికించేస్తుంది.. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండిల్లో దాడులు చేసినట్లు చెబుతున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ పార్లమెంటులో ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. తమ దేశాన్ని కాపాడాలంటూ దేవుడిని వేడుకున్నాడు సదరు ఎంపీ. ఈ సందర్భంగా తాము నిస్సహాయ స్థితిలో ఉన్నామని, రక్షించమని వేడుకున్నారు. ఈ సమయంలో తాజాగా మరో ఎంపీ బూతులతో రెచ్చిపోయారు!

అవును... ఇటీవల పాక్ పార్లమెంటులో ఓ ఎంపీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తే... తాజాగా మరో ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... తమ ప్రధానమంత్రి యుద్ధాన్ని ఎదుర్కోలేక పిరికిపందలా దాక్కునారని విమర్శలు గుప్పించారు. ఓ పక్క భారత్, మరోపక్క బలూచిస్తాన్.. పాక్ ని బాదేస్తున్న వేళ ప్రధాని సేఫ్ హౌస్ లో దక్కోవడంతో ఈయన ఆగ్రహం కట్టలు తెంచుకుందని అంటున్నారు.

ఈ సందర్భంగా మైకందుకున్న సదరు ఎంపీ.. ప్రధాని హెహబాజ్ షరీఫ్ పై విరుచుకుపడుతూ... టిప్పు సుల్తాన్ చెప్పిన ఓ కోట్ ను ప్రస్థావించారు.

ఇందులో భాగంగా... "సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే, వారు పోరాడలేరు.. వారు యుద్ధంలో ఓడిపోతారు"! "సరిహద్దుల్లో మన సైనికులు మనం ధైర్యం చూపాలని ఆశిస్తారు.. కానీ, మన ప్రధానే పిరికివాడైనప్పుడు.. మోడీ పేరునే తీసుకోలేనప్పుడు.. ముందు వరుసలో తన ప్రాణాలను పణంగా పెడుతున్న వారికి మనం ఏ సందేశం పంపుతున్నాము?" అని నిలదీశారు.