స్టూడెంట్ వీసా మీద వచ్చి డ్రగ్స్ దందా.. వాడ్ని నైజీరియాకు పంపేశారు
అవును.. మీరు చదివింది వాస్తవమే. ఫోన్ చేస్తే చాలు.. ఇంటికే కొకైన్ ను చేరవేసే నైజీరియన్ డ్రగ్స్ స్మగ్లర్ 28 ఏళ్ల విక్టర్ ఆటలకు చెక్ పెట్టేలా హైదరబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు.
By: Garuda Media | 13 Nov 2025 9:43 AM ISTఅవును.. మీరు చదివింది వాస్తవమే. ఫోన్ చేస్తే చాలు.. ఇంటికే కొకైన్ ను చేరవేసే నైజీరియన్ డ్రగ్స్ స్మగ్లర్ 28 ఏళ్ల విక్టర్ ఆటలకు చెక్ పెట్టేలా హైదరబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. డ్రగ్ స్మగ్లర్ గా వివిధ కేసుల్లో అతడి హస్తముంది. తాజాగా అతడ్ని అతడి దేశానికి డిపోర్ట్ చేశారు. ఇతడి డ్రగ్స్ దందాను గమనిస్తే పలు అంశాలు కనిపిస్తాయి. చట్టంలోని వెసులుబాటు.. ఈ తరహా వ్యక్తులు బరితెగించేందుకు వీలుగా ఉన్న అంశం అర్థమవుతుంది.
విక్టర్ విషయానికి వస్తే.. నాలుగేళ్ల క్రితం నైజీరియాకు చెందిన విక్టర్ స్టూడెంట్ వీసా మీద బెంగళూరులోని నోబెల్ కాలేజీలో చేరాడు. బీసీఏ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే డ్రగ్స్ సరఫరాదారుగా మారాడు. నైజీరియాలోని కింగ్ పిన్ నుంచి వచ్చిన సందేశాలకు తగ్గట్లు హైదరాబాద్.. బెంగళూరు నగరాల్లోని పెడ్లర్లకు యాభై నుంచి వంద గ్రాముల కొకైన్ చేరవేసేశాడు. కమీషన్ సొమ్ములతో విలాసవంతమైన జీవితానని గడుపుతున్నాడు.
ఇతడి ఆటకు చెక్ పెట్టారు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ అధికారులు. వారు చేపట్టిన తనిఖీల్లో విక్టర్ ను గుర్తించారు. బెంగళూరు కేంద్రంగా చేసుకొని హైదరాబాద్ లోని యాభై మందికి కొకైన్ చేరవేస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు.. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి వీసా ముగిసినప్పటికీ.. కొద్ది రోజుల క్రితమే పాస్ పోర్టు గడువును 2028 జులై వరకు పొడిగించుకున్నట్లుగా గుర్తించారు.
సరైన పత్రాలు లేకపోవటంతో.. అక్రమంగా నివాసం ఉండటం.. పెద్ద ఎత్తున డ్రగ్స్ కు స్మగ్లింగ్ కు పాల్పడుతున్న నేపథ్యంలో అతడ్ని నైజీరియాకు డిపోర్టేషన్ చేశారు. డ్రగ్స్ దందా చేసే వారిని గుర్తించివారిని వారి దేశాలకు డిపోర్టు చేస్తున్నారు. దౌత్యసంబంధమైన అంశం కావటంతో ఇలా చేయాల్సిన పరిస్థితి.
తప్పు చేసే వారిపై కఠినంగా శిక్షలు విధిస్తే.. కొత్తవారు ఈ దందాలోకి అడుగు పెట్టేందుకే భయపడే పరిస్థితి ఉంటుంది. అందుకు భిన్నంగా అత్తారింటికి అల్లుడ్ని తీసుకొచ్చినట్లుగా.. డ్రగ్స్ దందా చేసే విదేశీయుల్ని విమానం ఎక్కించి వారికి దేశానికి పంపించటం వల్ల డ్రగ్స్ దందాకు చెక్ పెట్టే వీలు తక్కువ ఉంటుందన్న విసయాన్ని పాలకులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. కాదంటారా?
