Begin typing your search above and press return to search.

నందమూరి ఆడపడుచు చేతికి టీడీపీ పగ్గాలు... బ్రాహ్మణికి ట్రైనింగ్?

గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం.. తీరమేమిటో గమ్యమెక్కడో తెలియదు పాపం.. అన్నట్లుగా అయిపోయింది టీడీపీ పరిస్థితి అని అంటున్నారు పరిశీలకులు.

By:  Tupaki Desk   |   29 Sep 2023 10:17 AM GMT
నందమూరి ఆడపడుచు చేతికి టీడీపీ పగ్గాలు... బ్రాహ్మణికి ట్రైనింగ్?
X

గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం.. తీరమేమిటో గమ్యమెక్కడో తెలియదు పాపం.. అన్నట్లుగా అయిపోయింది టీడీపీ పరిస్థితి అని అంటున్నారు పరిశీలకులు. ఎంతో చరిత్ర కలిగిన పార్టీ, జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పిన పార్టీ, నాలుగు దఫాలు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఇప్పుడు విలవిల్లాడిపోతుంది. తుఫాను గాలిలో చిగురుటాకులా వణికిపోతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అనంతరం టీడీపీ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. ఒక పక్క ఎన్నికలు సమీపిస్తున్నాయి.. మరోపక్క ఇంతకాలం అన్నీ తానై నడిపించిన అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.. ఎప్పుడు బయటకు వస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉన్న పరిస్థితి. పైగా మరో మూడు నాలుగు కేసులు వరుసగా రెడీగా ఉన్నాయి.

ఇదే సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన మెంట్ స్కాం కేసులో లోకేష్ కు నోటీసులు ఇవ్వడానికి సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్లారని తెలుస్తుంది. దీంతో చినబాబుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందని, అరెస్టైనా ఆశ్చర్యం లేదని ఊహాగాణాలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో నెక్స్ట్ పార్టీకి పెద్ద దిక్కు ఎవరు.. పార్టీని ముందుండి నడిపించాల్సింది ఎవరు అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో నందమూరి ఆడపడుచు బ్రాహ్మణి.. టీడీపీని లీడ్ చేయబోతున్నారని అంటున్నారు. బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భువనేశ్వరి వంటి వారికంటే బ్రాహ్మణి అయితేనే కరెక్ట్ అని పలువురు సీనియర్లు నమ్ముతున్నారంట.

అవును... బాబు ఇప్పటికే లోపల ఉన్నారు, చినబాబు కూడా వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణి టీడీపీ పగ్గాలు చేపట్టబోతున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే ఆమె పొలిటికల్ ట్రైనింగ్ క్లాసుల్లో బిజీగా ఉన్నారని అంటున్నారు. పార్టీలోని కొందరు సీనియర్లు పార్టీ వ్యవహారాలపైనా, సమకాలీన రాజకీయాలపైనా బ్రాహ్మణికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు చెబుతున్నారు.

దీంతో... చినబాబు కూడా లోపలికి వెళ్తే... యువగళం పాదయాత్రను బ్రాహ్మణి కంటిన్యూ చేస్తారా..? లేక, బస్సు యాత్ర వంటిది ప్లాన్ చేస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాధ్యతలు తీసుకోవడం, పగ్గాలు అందుకోవడం అంటే కుర్చీలో కుర్చోవడం కాదని... జనాల్లో ఎంత ఎక్కువగా తిరగగలిగితే అంత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారంట.

దీంతో మామగారితోపాటు, ఆమె భర్త కూడా లోపలికి వెళ్తే... తాను రంగంలోకి దిగడానికి బ్రాహ్మణి మానసికంగా సమాయత్తమవుతున్నారని అంటున్నారు. అటు నందమూరి ఆడపడుచుగా, ఇటు నారావారి కోడలుగా ఆమెకు ఆదరణ బాగుంటుందని పలువురు సీనియర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారంట.

దీంతో... జనాల్లోకి వెళ్ళినపుడు ఏయే విషయాలు మాట్లాడాని, ఎలాంటి విషయాలపైన స్పందించాలి, మరెలాంటి విషయాలపై దాటవేత దోరణి అవలంభించాలి మొదలైన జనరల్ నాలెడ్జ్ తో పాటు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ వ్యవహారాలపై అవగాహన తెచ్చుకునేలా ట్రనింగ్ తీసుకుంటున్నారని అంటున్నారు.

సపోజ్... బాబు బయటకు రాకుండా, లోకేష్ కూడా లోపలికి వెళ్తే.. బ్రాహ్మణి జనాల్లోకి వస్తే.. ఎలాంటి రియాక్షన్ వస్తుంది, కేడర్ లో ఎలాంటి ఉత్సాహం రాబోతోంది అనేది వేచి చూడాలి! కాగా... గతంలో నారా లోకేష్ కి తెలుగు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చేవారంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.