పంటలకు ఎం.ఎస్.పి. పెంపు... ఏపీకి, రైతులకు కేంద్రం గుడ్ న్యూస్!
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ఖరీఫ్ సీజన్ లో వరి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపునకు ఆమోద ముద్ర వేసింది
By: Tupaki Desk | 28 May 2025 1:18 PMకేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ఖరీఫ్ సీజన్ లో వరి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపునకు ఆమోద ముద్ర వేసింది. ఇదే సమయంలో.. ఏపీకి బద్వేల్ - నెల్లూరు నాలుగు లైన్ల హైవే విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సందర్భంగా పెంచిన కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పి) వివరాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
అవును... ఖరీఫ్ సీజన్ లో వరి సహా 14 పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇందులో భాగంగా.. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి క్వింటాల్ వరిపై రూ.69 పెంచింది. దీంతో కనీస మద్దతు ధర రూ.2369కి చేరింది. ఈ సందర్భంగా స్పందించిన అశ్వినీ వైష్ణవ్... గత 10-11 ఏళ్లలో ఖరీఫ్ పంటలకు ఎం.ఎస్.పీ. భారీగా పెంచినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పలు పంటలకు కనీస మద్దతు ధర కోసం రూ.2.7 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లు కేటాయించగా.. వారికి పెట్టుబడిపై 50% మార్జిన్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంటలు, పెరిగిన వాటి ఎం.ఎస్.పీ వివరాలను వెల్లడించారు.
క్వింటాల్ పై ఖరీఫ్ లో పంటలకు పెరిగిన కనీస మద్దతు ధర వివరాలు!:
వరి సాధారణ, గ్రేడ్ - ఏ - రూ.69
జొన్నలు - రూ.328
సజ్జలు - రూ.150
రాగులు - రూ.596
మొక్కజొన్న - రూ.175
కందిపప్పు - రూ.450
పెసర పప్పు - రూ.86
మినుములు - రూ.400
వేరుశెనగ - రూ.480
పొద్దుతిరుగుడు - రూ.441
సోయాబీన్ - రూ.436
కుసుములు - రూ.579
ఒలిసెలు - రూ.820
పత్తి - రూ.589
ఏపీకి బిగ్ గుడ్ న్యూస్..!:
ఏపీలోని బద్వేల్ - నెల్లూరు నాలుగు లైన్ల రహదారి అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3,653 కోట్లతో 108.134 కి.మీల పొడవున ఈ రహదారిని అభివృద్ధి చేయనుంది. ఈ నిర్మాణం చేపట్టే కారిడార్ తో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం సుమారు 33.9 కి.మీ. తగ్గనుంది. ఈ కారిడార్ నిర్మాణంతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం తెలిపింది.