Begin typing your search above and press return to search.

మోషేన్ రాజుపై అవిశ్వాసం.. కూట‌మి సంచ‌ల‌న నిర్ణ‌యం..!

శాస‌న మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజు వ్య‌వ‌హార శైలిపై కూట‌మి ప్ర‌భుత్వం తీవ్ర ఆందోళ‌నతో ఉంది.

By:  Tupaki Desk   |   16 May 2025 5:12 AM
మోషేన్ రాజుపై అవిశ్వాసం.. కూట‌మి సంచ‌ల‌న నిర్ణ‌యం..!
X

శాస‌న మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజు వ్య‌వ‌హార శైలిపై కూట‌మి ప్ర‌భుత్వం తీవ్ర ఆందోళ‌నతో ఉంది. ఇప్ప‌టికి వైసీపీకి చెందిన ఆరు గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వీరిలో జ‌య‌మంగ‌ళ వెంక‌ట ర‌మ‌ణ, బ‌ల్లి క‌ళ్యాణ చ‌క్ర‌వ‌ర్తి, పోతుల సునీత స‌హా.. ఇటీవల రెండు రోజుల కింద‌ట రాజీనామా చేసిన జ‌కియా ఖానుం వంటి వారు ఉన్నారు. అయితే.. మైనారిటీ నాయ‌కురాలు, డిప్యూటీ చైర్ ప‌ర్స‌న్ జ‌కియా ఖానుం ను ప‌క్క‌న పెట్టినా.. మిగిలిన వారు రాజీనామా చేసి ఐదారు నెల‌లు అయిపోయింది.

అయినా.. కూడా ఇప్ప‌టి వ‌ర‌కు మోషేన్ రాజు వారి రాజీనామాల‌ను ఆమోదించ‌లేదు. పైగా.. వాటిపై ఎ లాంటి స‌మాధానం కూడా చెప్ప‌డం లేదు. వారి రామాజీనామాల వ్య‌వ‌హారం ఏమైంద‌ని మండ‌లి స‌చివా ల‌యం సెక్ర‌ట‌రీ ని ప్ర‌శ్నిస్తే.. ఆయ‌న కూడా స‌మాధానం చెప్ప‌డం లేదు. ఇదిలావుంటే.. తమ రాజీనా మాల‌ను ఆమోదించాల‌ని కోరుతూ.. స‌ద‌రు నాయ‌కులు.. ప‌దే ప‌దే మండ‌లికి కూడా వ‌స్తున్నారు. అయినా .. మోషేన్ రాజు మాత్రం క‌రుణించ‌డం లేదు.

దీంతో స‌ద‌రు రాజీనామా చేసిన నాయ‌కులు త్రిశంకు స్వ‌ర్గంలో ఉండిపోతున్నారు. వారు ఇత‌ర పార్టీల్లోకి వెళ్ల‌లేక‌.. రాజ‌కీయంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో కూట మి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మండ‌లి వ‌ర్గాల స‌మాచారం మేర‌కు.. మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీనిపై సీరియ‌స్‌గానే కూట‌మి స‌ర్కారు దృష్టి పెట్టిన‌ట్టు అమ‌రావ‌తి రాజ‌కీయ వ‌ర్గాలు సైతం చెబుతున్నాయి.

వ్య‌క్తిగ‌తంగా మోషేన్ రాజుపై ఎలాంటి విమ‌ర్శ‌లు లేక‌పోయినా.. స‌భ్యుల రాజీనామాల‌ను తొక్కిపెట్టే విష‌యంపై మాత్రం స‌ర్కారు సీరియ‌స్‌గా ఉంద‌ని తెలుస్తోంది. గ‌తంలో ఎన్న‌డూ ఇలా జ‌ర‌గ‌లేద‌ని.. అయితే.. ఔను.. లేదంటే కాద‌ని చెప్పేస్తే.. స‌భ్యుల‌కు ఇబ్బంది ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబుకూడా తాజాగా నిర్వ‌హించిన పొలిట్ బ్యూరో స‌మావేశంలో పేర్కొన్న‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ క్ర‌మంలో ``మ‌నం చేయాల్సింది మ‌నం చేద్దాం`` అని సీఎం వ్యాఖ్యానించారు.

దీనిని బ‌ట్టి.. వ‌చ్చే స‌మావేశాల్లో మండ‌లి చైర్మ‌న్‌పై అవిశ్వాసం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇదే.. జ‌రిగితే ఏపీ చ‌రిత్ర‌లో తొలిసారి మండ‌లి చైర్మ‌న్‌పై అవిశ్వాసం ప్ర‌క‌టించిన‌ట్టు అవుతుంది. అయితే.. ప్ర‌స్తుతం వైసీపీదే మండ‌లిలో పైచేయిగా ఉంది. కాబ‌ట్టి అవిశ్వాసం వీగిపోయినా వీగిపోవ‌చ్చ‌ని మ‌రో టాక్‌. కానీ.. అవిశ్వాసం అంటూ ప్ర‌వేశ పెడితే.. అప్పుటు మండ‌లి చైర్మ‌న్‌గా మోషేన్ రాజు వ్య‌వ‌హార శైలిపై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌స్తుంద‌ని..త ద్వారా.. ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త పెంచొచ్చ‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.