Begin typing your search above and press return to search.

తిరుమలలో చిరుత ఘటనపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

అయితే ఈ చిన్నారి మృతి విషయంలో అనుమానం ఉందని, విచారణ జరిపించాలని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   12 Aug 2023 7:18 AM GMT
తిరుమలలో చిరుత ఘటనపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
X

తిరుమల నడక మార్గంలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. చిరుత దాడిలోనే చిన్నారి మృతిచెందినట్టు అధికారులు తేల్చారు. అయితే ఈ చిన్నారి మృతి విషయంలో అనుమానం ఉందని, విచారణ జరిపించాలని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... తిరుమల ఘాట్ రోడ్‌ లో బాలిక మృతి చెందిన ఘటనపై స్పందించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి... ఆ మృతిపై తనకు చాలా అనుమానాలున్నాయని అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే టీటీడీ చైర్మన్‌, ఈవోతో ఫోన్‌ లో మాట్లాడినట్లు తెలిపిన ఆయన... మృతురాలి కుటుంబాన్ని ఆదుకునే విషయాన్ని కూడా ఆలోచిస్తామని అన్నారని అన్నారు.

అనంతరం ఆ బాలిక మృతిపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాలిక తల్లిదండ్రులపై తనకు అనుమానం ఉందని చెప్పిన ఆయన... వారిని కూడా క్షుణ్ణంగా విచారించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు! దీంతో ఇష్యూ మరింత సంచలనంగా మారింది.

కాగా... తిరుమల – అలిపిరి కాలి నడక దారిలో చిన్నారి మొదట తప్పిపోయింది.. ఆ తర్వాత ఆమెపై ఎలుగుబంటి దాడిటిచేసి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేశారు. చివరకు శుక్రవారం రాత్రి తప్పిపోయిన చిన్నారి ఉదయం నడకదారిలోని నరసింహస్వామి ఆలయం వద్ద శవమై తేలింది.

అయితే... చిన్నారి మెడపై దాడి చేసి ముఖ భాగాన్ని పూర్తిగా తినేసి ఉండడంతో.. చివరకు చిరుత దాడిలోనే చిన్నారి మృతిచెందినట్టు అధికారులు తేల్చారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని తిరుపతి రుయా మార్చురీకి తరలించారు. ఈ సమయంలో ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి.