Begin typing your search above and press return to search.

రోజూ చేపలు తింటే ఐశ్వర్యరాయ్‌ లాంటికళ్లు... టంగ్ స్లిప్ అయిన మంత్రి!

రోజు చేపలు తింటే హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ కళ్లు లాగా అందంగా ఉంటాయని పేర్కొంటూ నోరుజారారు

By:  Tupaki Desk   |   22 Aug 2023 4:14 AM GMT
రోజూ చేపలు తింటే ఐశ్వర్యరాయ్‌ లాంటికళ్లు... టంగ్ స్లిప్ అయిన మంత్రి!
X

ప్రజాసేవకోసం అని రాజకీయాల్లోకి వచ్చి ఆయా నాయకులు చేస్తున్న కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తుంటే... వీరి దృష్టంతా ప్రజాసమస్యలపై కంటే హీరోయిన్స్ కళ్లు, బుగ్గలు, అంద చంద్రాలపైనే ఉన్నట్లున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా బీజేపీ మంత్రి ఒకరు ఐశ్వర్యా రాయ్ పేరు చెప్పి కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... మహారాష్ట్ర బీజేపీ మంత్రి వివాదంలో చిక్కకున్నారు. రోజు చేపలు తింటే హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ కళ్లు లాగా అందంగా ఉంటాయని పేర్కొంటూ నోరుజారారు. నందుర్బార్‌ జిల్లాలో జరిగిన మత్య్సకారుల సమావేశంలో రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి విజయ్‌ కుమార్‌ గవిత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మైకందుకున్న ఆయన... రోజూ చేపలను తినే వ్యక్తుల చర్మం మృదువుగా మారుతుందని, కళ్లు మెరుస్తాయని అన్నారు. తమ వైపు ఎవరూ చూసినా.. వెంటనే ఆకర్షితులవుతారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

అక్కడితో ఆగని ఆయన... "ఐశ్వర్యరాయ్ గురించి నేను మీకు చెప్పలేదు కదూ..? ఆమె మంగళూరులోని సముద్ర తీరానికి సమీపంలో నివసించేది. ఐశ్యర్య రోజూ చేపలు తినేది. మీరు ఆమె కళ్ళు చూశారా? రోజూ చేపలు తింటే మీ కళ్లు కూడా టైశ్వర్యరాయ్‌ లాగే అందంగా తయారవుతాయి. చేపలో ఉండే కొన్ని రకాల నూనెలు వల్ల చర్మం మృదువుగా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా వాయించి వదులుతున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా.. ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయకుండా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మిత్కారీ మండిపడ్డారు

కాగా... రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూడా... గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ ప్రాంతంలో రహదారులను బాగుచేయించాలనే ప్రజల విజ్ఞప్తి మేరకు.. అక్కడున్న చీఫ్ ఇంజినీర్ తో... "నా నియోజకవర్గంలో రహదారులు కత్రినా కైఫ్‌ బుగ్గల్లా ఉండాలి" అని మంత్రి అన్నారు. దీంతో నాడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి!