Begin typing your search above and press return to search.

బ్రాహ్మణిని మోత మోగించిన రోజా.. కామెంట్స్ వైరల్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఈ రోజు "మోత మోగిద్దాం" అనే కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Sep 2023 8:09 AM GMT
బ్రాహ్మణిని మోత మోగించిన రోజా.. కామెంట్స్ వైరల్!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఈ రోజు "మోత మోగిద్దాం" అనే కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్ లైన్ వేదికగా ఈ విషయాన్ని వైరల్ చేసే పనిలో ఉన్నారు టీడీపీ శ్రేణులు. ఈ సమయంలో ఆ మోత మోగిద్దాం కార్యక్రమంపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

అవును... స్కిల్‌ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు న్యాయస్థానం ఆదేశాలతో జైలుకెళితే.. అందుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తారా అంటూ మంత్రి రోజా నిలదీశారు. అంటే.. మీరు కోర్టుల కంటే గొప్పోళ్లా? న్యాయవ్యవస్థ కంటే అతీతులా? అని సూటిగా ప్రశ్నించిన రోజా... మీరు చేపట్టే నిరసనలు కోర్టుల నిర్ణయాలకు వ్యతిరేకం అవుతాయన్న జ్ఞానం లేదా? అంటూ సీరియస్ గా స్పందించారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతుగా శనివారం రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు గంటలు, కంచాలు, గరిటెలతో మోత మోగిద్దామంటూ నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి పిలుపునివ్వడంపై మంత్రి రోజా తాజాగా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సమయంలో ప్రశ్నల వర్షం కురిపిస్తూనే విమర్శల తుఫాను తెప్పించారు! దీంతో.. బ్రాహ్మణిని అమ్మా అని సంబోదిస్తూనే ఇవ్వాల్సినవి ఇచ్చిపడేశారని అంటున్నారు నెటిజన్లు!

ఈ ట్వీట్ లో భాగంగా... చంద్రబాబు అవినీతి చేసి జైలుకు వెళ్తే, అలాంటి అవినీతిపరుడికి ప్రజల మద్దతును కోరడం ఏమిటని రోజా ప్రశ్నించారు. మీ భర్త నారా లోకేష్ కి మంగళగిరిలో ఎలా మోత మోగించి ఓడించారో గుర్తులేదా? అని అడిగారు. మీ మామ ఏమో అన్ని రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ కొడితే.. నువ్వు, నీ భర్త ముద్రగడ గారి పోరాటాన్ని కాపీ కొడతారా అంటూ ఎద్దేవాతో కూడిన ప్రశ్నలు సంధించారు!

ఇదే సమయంలో.. "నీ మామ మీద ప్రపంచం మొత్తం బెంగ పెట్టుకుందని మీరంతా భ్రమల్లో ఉన్నట్లున్నారు. కానీ నారాకాసురుడు ఇన్నాళ్లకు దొరికాడని ప్రజలంతా ముందుగానే దీపావళి చేసుకుంటున్నారు" అని తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు రోజా! ఇదే క్రమంలో... మీ మామ మోసానికి, అవినీతికి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లోనే మోత మోగించి 23 సీట్లతో ఇంటికి పంపించారని రోజా నాటి ఎన్నికల ఫలితాలు గుర్తు చేశారు.

కాగా, లంచాలు తినేసి కంచాలు వాయించమంటారా అంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ఫైరయిన సంగతి తెలిసిందే. బాబు కోసం "మోత మొగిద్దాం" కార్యక్రమంపై స్పందించిన అంబటి రాంబాబు... అవినీతికి పాల్పడి, అడ్డంగా దొరికిపోయినా సిగ్గులేకుండా కంచాలు మోగిస్తామంటున్నారని మండిపడ్డారు.

ఐదేళ్లు అడ్డంగా తినేసిన బకాసురులంతా కలిసి ఇప్పుడు ఎవరి మీద కంచాలు మోగిస్తున్నారు? ఎవరి మీద విజిళ్లు ఊదుతారు? ఎవరిని ఉద్దేశించి హారన్లు కొడతారు? తినేది లంచాలు.. మోగించేది కంచాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.