ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది మృతి, 3 గాయాలు.. క్రిమినల్ గ్యాంగ్ల పనేనా?
మెక్సికోలోని గువానాజువాటో రాష్ట్రంలోని శాన్ హోసే ఇతుర్బే పట్టణంలో ఆదివారం (జూన్ 1, 2025) ఒక డ్ర**గ్ రిహాబిలిటేషన్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By: Tupaki Desk | 2 Jun 2025 2:00 PM ISTమెక్సికోలోని గువానాజువాటో రాష్ట్రంలోని శాన్ హోసే ఇతుర్బే పట్టణంలో ఆదివారం (జూన్ 1, 2025) ఒక డ్ర**గ్ రిహాబిలిటేషన్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక అధికారులు అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.
అగ్నిప్రమాద కారణాలపై దర్యాప్తు
అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు మున్సిపాలిటీ వెల్లడించింది. ఒక ప్రకటనలో, "మాదకద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూ మరణించిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము" అని పేర్కొంది.
మృతుల అంత్యక్రియల ఖర్చులను చెల్లించడానికి ప్రభుత్వం సహాయం అందిస్తామని మున్సిపాలటీ అధికారులు హామీ అందించారు. మెక్సికన్ మీడియా సంస్థలు ఆదివారం వెల్లడించిన దాని ప్రకారం.. అగ్నిప్రమాదంలో మరణించిన బాధితులను రిహాబిలిటేషన్ సెంటర్ లోపల పెట్టి తాళం వేసి ఉంచినట్లు తెలిసింది. గత ఫిబ్రవరిలో కూడా మెక్సికో సిటీలోని ఒక పునరావాస కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారు.
క్రిమినల్ గ్యాంగ్ల పనేనా?
ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, ఇది క్రిమినల్ గ్యాంగ్ల కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ప్రాంతంలో క్రియాశీలంగా ఉన్న డ్ర**గ్ కార్టెల్లు (మాదకద్రవ్యాల ముఠాలు) గతంలో కూడా ఇలాంటి క్లినిక్లను లక్ష్యంగా చేసుకుని, రోగులను బలవంతంగా తమ సమూహంలోకి చేర్చుకోవడానికి ప్రయత్నించాయి.
వరుస దాడులు..కార్టెల్ల అకృత్యాలు!
ఈ విషాద సంఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి నిపుణులు ఆధారాలను సేకరిస్తున్నారని, సాక్షులను విచారిస్తున్నారని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఇది డ్ర**గ్ రిహాబిలిటేషన్ సెంటర్పై దాడి జరగడం మొదటిసారి కాదు. గత ఏప్రిల్లో, సినలోవాలోని ఇలాంటి ఒక కేంద్రంపై సాయుధులు దాడి చేయగా, తొమ్మిది మంది మరణించారు. తమతో చేరడానికి నిరాకరించే రోగులను కార్టెల్లు తరచుగా చంపేస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలు మెక్సికోలో డ్ర**గ్ కార్టెల్ల హింసాత్మక కార్యకలాపాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి.
