Begin typing your search above and press return to search.

మా దేశానికి రండి.. భారతీయులను బతిమిలాడుతున్న మాల్దీవుల నేతలు

మాల్దీవుల ఆదాయంలో ప్రతి పైసా మనదే. మనం ఏదో పోనీలో అని వేసిన భిక్షంతో వారు బతికారు.

By:  Tupaki Desk   |   7 May 2024 9:49 AM GMT
మా దేశానికి రండి.. భారతీయులను బతిమిలాడుతున్న మాల్దీవుల నేతలు
X

భారత్, మాల్దీవుల మధ్య మొదలైన వివాదం కొనసాగుతూనే ఉంది. మన దేశంతో సంబంధాల వల్ల ఆ దేశం పురోగమనం ముడిపడి ఉందనే కనీస జ్ణానాన్ని మరిచి మనతో విభేదాలు పెంచుకున్నారు. ఫలితంగా వారి ఆదాయానికి గండి పడింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు భారతీయులు మంచి వారు మాతో కలిసి రండి అని వేడుకున్నంత మాత్రాన సంబంధాలు బాగుపడతాయా? మన ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టిన మాల్దీవులకు తగిన గుణపాఠమే కలిగింది.

మాల్దీవుల ఆదాయంలో ప్రతి పైసా మనదే. మనం ఏదో పోనీలో అని వేసిన భిక్షంతో వారు బతికారు. కానీ మన ఆత్మాభిమానాన్నే దెబ్బతీశారు. భారతీయులు శుభ్రంగా ఉండరు. వారి దేశం అశుభ్రతకు మారు పేరు అని మన దేశం గురించి రకరకాల కామెంట్లు చేశారు. దీంతో మనకు ఎక్కడో కాలడంతో ఆ దేశంతో సంబంధాలు కట్ చేసుకున్నాం. దీంతో వారి ఆదాయం క్రమంగా తగ్గుతూ వచ్చింది.

ఇప్పుడు ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైజల్ భారతీయులు తమ దేశానికి రావాలని కోరుతున్నారు. మా కొత్త ప్రభుత్వం భారత్ తో కలిసి పనిచేస్తుందని చెబుతున్నా మన దేశం మాత్రం వారి మాటలను విశ్వసించడం లేదు. ఒకసారి పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావడం అంత సులభం కాదు. అందుకే మాట, తూట జారితే తిరిగి తీసుకోలేమని విషయం వారు గుర్తించడం లేదు. అందుకే వారి మాటలకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు.

మా టూరిజంలో భారతీయుల పాత్ర ఉండాలని కోరుకుంటున్నామని విజ్ణప్తి చేస్తున్నారు. మా పురోగమనంలో మీ పాత్ర ఉందనే విషయం మేం గుర్తించాం. దయచేసి మా విన్నపాన్ని మన్నించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ మనకు మాత్రం వారి మాటల మీద నమ్మకం పోయింది. లేని పోని మాటలు మాట్లాడటంతో ఆ దేశం భారీ మూల్యాన్నే చెల్లించుకుంటోంది.

మన ప్రధానమంత్రి మన లక్ష్యద్వీప్ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తే టూరిజం బాగుంటుందని చెబితే దానిపై మాల్దీవులు కౌంటర్ వేయడం అందరిని బాధించింది. మన సొమ్ముతో జల్సాలు చేసుకునే ఆ దేశం మన మీదే పెత్తనం చెలాయించాలని చూస్తే ఫలితం ఎలా ఉంటుందో రుచి చూపించాం. ఇక మాల్దీవులకు శంకరగిరి మాన్యాలే అని తెలిసిపోయింది.