Begin typing your search above and press return to search.

పాస్ పోర్టుకు సిటీకి వచ్చి ఫ్రెండ్ ఇంటి బాత్రూంలో మరణం

మణిరాజ్ పాస్ పోర్టు తీసుకోవటం కోసం తండ్రితో కలిసి హైదరాబాద్ కు వచ్చారు

By:  Tupaki Desk   |   31 July 2023 5:23 AM GMT
పాస్ పోర్టుకు సిటీకి వచ్చి ఫ్రెండ్ ఇంటి బాత్రూంలో మరణం
X

పాస్ పోర్టు తీసుకోవటానికి వరంగల్ నుంచి హైదరాబాద్ మహానగరానికి వచ్చిన ఐటీ ఉద్యోగి ఒకరు అనుమానాస్పద రీతిలో మరణించిన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. ఐటీ కారిడార్ పరిధిలోని నార్సింగిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

వరంగల్ కు చెందిన ముప్ఫై ఏళ్ల మణిరాజ్ పాస్ పోర్టు తీసుకోవటం కోసం తండ్రితో కలిసి హైదరాబాద్ కు వచ్చారు. ఈ నెల 28న సిటీకి వచ్చిన అతడు.. అదే రోజు సాయంత్రం తండ్రిని ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద విడిచి నార్సింగిలోని తన స్నేహితుడు చాణక్య ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాతి రోజు మిగిలిన స్నేహితులతో కలిసి సిటీలోని టెంపుల్స్ కు వెళ్లాడు. జూబ్లీహిల్స్ లోని పబ్ కు వెళ్లాడు. అనంతరం తాను ఒక్కడే ఫ్రెండ్ అయిన చాణక్య ఇంటికి వచ్చాడు.

ఆదివారం ఉదయం అపార్టుమెంట్ మీటింగ్ కోసం చాణుక్య కిందకు వెళ్లాడు. ఆ టైంలో మణిరాజ్ బాత్రూంలో ఉన్నాడు. మీటింగ్ తర్వాత ఇంటికి చేరుకున్న చాణక్య.. అప్పటికి మణిరాజ్ బాత్రూంలో ఉండటాన్ని గుర్తించాడు. దీంతో.. తలుపు కొట్టినా తీయలేదు. అనుమానం వచ్చిన చాణక్య.. ఇరుగుపొరుగువారిని పిలిచి తలుపు బద్దలు కొట్టారు. అప్పటికే మణిరాజ్ స్ప్రహలో లేకుండా పడి ఉన్నాడు. అతడు మరణించిన విషయాల్ని గుర్తించాడు.

వెంటనే.. ఈ విషయాన్ని మణిరాజ్ తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించాడు చాణక్య. తండ్రి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. చిన్న వయసులో బాత్రూంలో మరణించిన మణిరాజ్ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.