Begin typing your search above and press return to search.

ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రైవేట్ ఫ్యామిలీ ఈవెంట్...కోటి డాలర్ల వ్యాపారం!

తాజాగా గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రీవెడ్డింగ్ ఇవెంట్ ఈ కోవలోకే చెందుతుంది. ఈ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడిచింది.

By:  Tupaki Desk   |   5 March 2024 2:27 PM GMT
ఇండియాస్  బిగ్గెస్ట్  ప్రైవేట్  ఫ్యామిలీ ఈవెంట్...కోటి డాలర్ల వ్యాపారం!
X

ప్రపంచ వ్యాప్తంగా రోజూ కొన్ని లక్షల వివాహాలు, వాటి తాలూకు స్పెషల్ ఈవెంట్లూ జరుగుతుంటాయి. అయితే వాటిలో అతి తక్కువ.. అత్యంత తక్కువ ఈవెంట్లు మాత్రం మీడియాలో హైలైట్ అవుతుంటాయి. ఈ క్రమంలో నూటికో కోటికో ఒక్కటి రెండు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంటాయి. తాజాగా గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రీవెడ్డింగ్ ఇవెంట్ ఈ కోవలోకే చెందుతుంది. ఈ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడిచింది.

అవును... దేశవ్యాప్తంగా... కాదు కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు వైరల్ గా మారాయి. తొలిరోజు 51వేల మందికి అన్న సేవతో ప్రారంభమైన ఈ వేడుకలు సుమారు 2,500 రకాల వంటకాలతో వార్తల్లో నిలవగా.. ఇక ఈ వేడుకకు వచ్చిన అతిరథ మహారథులు మరో హాట్ టాపిక్. స్వాతంత్ర భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంతమంది మహారథులైన అతిథులు హాజరైన వివాహం ఇదే అన్నా అతిశయోక్తి కాదేమో!

ఈ క్రమంలో ఈ వేడుకకు హాజరైన తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్లు, బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్ల సందడి మరొకెత్తనే చెప్పాలి. వాటితోపాటు ప్రధానంగా ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ధరించిన దుస్తులు, నగలు మరో హాట్ టాపిక్. ఆ నగల ధర ఇంత, ఆ నెక్లస్ ధర ఎంతో తెలుసా, ఆమె ధరించిన చీర ఎన్ని కోట్లంటే... వంటి ఆసక్తికరమైన శీర్షికలతో నెట్టింట చిన్న సైజు జనరల్ నాలెడ్జ్ క్లాసులే జరిగాయి!!

ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన "ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రైవేట్ ఫ్యామిలీ ఈవెంట్" గా అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరిగిందని అంటున్నారు. ఇదే సమయంలో ఈ వేడుకకు సంబంధించిన కంటెంట్ పై ప్రపంచ వ్యాప్తంగా నెట్టింట కోటి డాలర్ల వ్యాపారం జరిగి ఉంటుందనే చర్చా తెరపైకి వచ్చింది. ఆ స్థాయిలో ఈ ఈవెంట్ నెట్టింట వైరల్ గా మారుతూ.. ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు రిహన్నా, మిజిషియన్ డేవిడ్ బ్లెయిన్ తోపాటు ప్రముఖ గాయకుడు బీ ప్రాక్ (ప్రతీక్ బచ్చన్), అర్జిత్ సింగ్, అజయ్ - అతుల్, దిజిలిత్ దోశాంక వంటి టాప్ సింగర్స్ తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక మహేంద్ర సింగ్ ధోనీ దాండియా మరో వైరల్ టాపిక్ గా మారింది.

ఇదే క్రమంలో మూడురోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో ట్రిపుల్ ఆర్ పాటకు బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్, సల్మాన్, అమీర్ లతో పాటు మెగా పవర్ స్టార్ రాం చరణ్ వేసిన స్టేప్పులకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ కంటెంట్ గా మారింది! ఇదే సమయంలో వేడుకల్లో చివరి రోజు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ చేసిన క్లాసికల్ డ్యాన్స్, అందుకు ఆమె ధరించిన చీరకున్న ప్రత్యేకత మరింత వైరల్ గా మారింది.

వీరితో పాటు రణబీర్ - ఆలియా, రణ్ వీర్ సింగ్ - దీపికా పదుకుణే, కరీనా కపూర్ – సైఫ్ ఆలీఖాన్ తదితర బాలీవుడ్ స్టార్ కపుల్స్ ఈ వేడుకల్లో చేసిన సందడి మరొకెత్తు అని అంటున్నారు. పైగా ప్రెగ్నెన్సీ ప్రకటన అనంతరం దీపికా - రణ్ వీర్ లు చేసిన డ్యాన్స్ మరో ప్రత్యేక ఆకర్షణ అని అంటున్నారు! ఇలా నెట్టింట వైరల్ కావడానికి పూర్తి అర్హత ఉన్న కంటెంట్, కోటి డాలర్లు వ్యాపారం జరగడానికి అనువైన కంటెంట్ తో ఈ ఈవెంట్ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది!