Begin typing your search above and press return to search.

టాప్ 6 అప్డేట్స్: గురువారం అర్థరాత్రి వేళ ఏం జరిగింది?

గురువారం రాత్రి ఒక్కసారిగా భారత సరిహద్దు రాష్ట్రాలైన జమ్ము.. కశ్మీర్.. పంజాబ్.. రాజస్థాన్ లను లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్ ఆత్మాహుతి డ్రోన్లను.. ఫైటర్ జెట్లతో దాడులకు తెగబడింది.

By:  Tupaki Desk   |   9 May 2025 9:28 AM IST
Operation Sindoor 2.0 Key Updates
X

యుద్ధ విమానాలతో తెగబడిన పాకిస్తాన్ కు భారతదేశం శక్తివంతంగా తిప్పి కొట్టింది. అంతేకాదు.. పాక్ కు తీవ్ర నష్టం వాటిల్లేలా చేసింది. గురువారం రాత్రి ఒక్కసారిగా భారత సరిహద్దు రాష్ట్రాలైన జమ్ము.. కశ్మీర్.. పంజాబ్.. రాజస్థాన్ లను లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్ ఆత్మాహుతి డ్రోన్లను.. ఫైటర్ జెట్లతో దాడులకు తెగబడింది. వైమానిక.. సైనిక.. ప్రముఖ స్థలాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. అయితే.. ఈ దాడుల్ని భారత ఆర్మీ సమర్థంగా తిప్పి కొట్టింది. పాకిస్తాన్ ఆశల్ని వమ్ము చేసింది. అదే సమయంలో దానికి కోలుకోలేని దెబ్బలు పడేలా చేసింది.

పాక్ దాడుల్ని ఆకాశంలోనే తిప్పి కొట్టిన భారత్.. ఎలాంటి నష్టం వాటిల్లకుండా వ్యవహరించింది. ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ ను అర్ధాంతరంగా ఆపేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్ అవుట్ ప్రకటించారు. మొత్తంగా 15 ప్రాంతాల్లో దాడులకు పాక్ ప్లాన్ చేయగా.. ముందుగానే గుర్తించిన మన సైన్యం ఆ ప్రయత్నాల్ని అడ్డుకుంది. అదే సమయంలో పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలని ధ్వంసం చేయటంలో కీలకంగా వ్యవహరించింది.

గురువారం రాత్రి నుంచి అర్థరాత్రి దాటే వరకు చోటు చేసుకున్న ఆరు కీలక అప్డేట్స్ ను చూస్తే..

- భారీగా కూల్చివేతలు

సరిహద్దు రాష్ట్రాలను టార్గెట్ చేసిన పాక్ సైన్యం మొత్తం 15 ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడింది. అయితే.. వాటిని సమర్థంగా అడ్డుకున్న భారత సైన్యం.. పాక్ కు భారీగా నష్టం వాటిల్లేలా చేశారు. పాక్ దాడుల్ని భారత ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవ రహిత ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకోవటమే కాదు.. 8 ఆత్మాహుతి డ్రోన్లు.. 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది.

- భారత అదుపులో పాక్ పైలెట్

భారత్ లో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేధించేందుకు వచ్చిన పాక్ పైటర్ జెట్ పైలెట్ భారత్ కు బంధీగా చిక్కాడు. పఠాన్ కోట్ సెక్టార్ లో పాక్ కు చెందిన 2 ఫైటర్ జెట్లను భారత సైన్యం కూల్చేసింది. ఇందులో ఎఫ్ 16 యుద్ధ విమానం కూడా ఉంది. అదే సమయంలో ఎఫ్ 16 పైలట్ ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. అతడ్ని అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ కార్యాలయానికి తీసుకెళ్లారు. పాకిస్థాన్ కు ఇది భారీ ఎదురుదెబ్బగా చెబుతున్నారు.

- భారత్ - పాక్ ఉద్రిక్తతలపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ

పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి.. దానికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అంశాలు బ్రిటన్ పార్లమెంట్ లో చర్చకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను ఉపసంహరింపజేయాలని ఎంపీలు తమ ప్రభుత్వానికి సూచన చేశాయి. పాక్ లో తిష్ట వేసిన ఉగ్రవాదులు భారత్ కు మాత్రమే కాదు ప్రాశ్చాత్య దేశాలకు ప్రమాదకరమే అంటూ భారత సంతతి ఎంపీ ప్రీతి పటేల్ హెచ్చరించారు.

- పాక్ లోని ఈ నగరాల్లో పేలుళ్లు

భారత్ లోని సరిహద్దు రాష్ట్రాలపై ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిన నేపథ్యంలో పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో భారత్ ఎదురుదాడులు చేపట్టింది. లాహోర్.. కరాచీ.. రావల్పిండి.. గుర్జన్ వాలా.. చక్వాల్.. అటోక్.. బహావల్ పూర్.. మియాన్ వాలి.. ఛోర్ నగరాలపై భారత్ 12 హెరాన్ డ్రోన్లతో దాడికి పాల్పడినట్లుగా పాక్ సైనికాధికారులు వెల్లడించారు.

- టార్గెట్ పాక్ ఎయిర్ డిఫెన్స్

భారత యుద్ధ విమానాలు పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై సియాడ్ దాడులు నిర్వహించాయి. 25కు పైగా డ్రోన్లతో లాహోర్ లోని లక్ష్యాల్ని సరిగా గురి పెట్టినట్లుగా వెల్లడించారు.లాహోర్.. రావల్పిండి.. కరాచీతో సహా తొమ్మిది నగరాల్లో పాక్ ఎయిర డిఫెన్స్ వ్యవస్థలపై దాడులకు పాల్పడుతుంది.

- ఫేక్ పోస్టులతో సోషల్ మీడియాలో రచ్చ

గురువారం రాత్రి పాకిస్తాన్ మొదలు పెట్టిన దాడుల్ని భారత్ సమర్థంగా తిప్పి కొట్టటం ఒక ఎత్తు అయితే.. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కుట్ర పన్నుతోంది. పలు ఫేక్ పోస్టులతో భారత్ లో ఏదో జరిగిపోయిందన్న భావన కలుగజేసేలా.. తప్పుడు ప్రచారానికి తెర తీశారు. పాత వీడియోలతో తాము భారత్ మీద దాడులు చేపట్టి.. నష్టపరిచినట్లుగా పేర్కొనే తప్పుడు పోస్టులు అస్సలు నమ్మొద్దని చెబుతున్నారు. అదే సమయంలో సరిహద్దుల్లోని భారత సైనిక కేంద్రాల్ని పేల్చేశామని పాక్ సమాచార శాఖ మంత్ి అత్తావుల్లా తరార్ స్కైన్యూస్ తో పాటు సీఎన్ఎన్ కు తెలిపారు. 40-50 మంది వరకు భారత సైనికులు చనిపోయారని పేర్కొనగా.. భారత్ దీన్ని తీవ్రంగా ఖండించింది. అలాంటిదేమీ జరగలేదని.. అన్ని డ్రోన్లను అడ్డుకున్నామని స్పష్టం చేయటం గమనార్హం.