పాక్ తో యుద్ధం : విశాఖ హైదరాబాద్ టార్గెట్ ?
ఇక భారత ప్రజలు ఏది కోరుకుంటే అదే జరిగి తీరుతుందని తాజాగా రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ చేసిన ప్రకటనతో యుద్ధం అనివార్యం అన్నది తేలిపోయింది.
By: Tupaki Desk | 6 May 2025 11:00 PM ISTభారత్ పాకిస్థాన్ కి మధ్య యుద్ధం అన్నది అనివార్యం అయిపోయింది. దీనికి సంబంధించి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్రధాని నరేంద్ర మోడీ అయితే వరసబెట్టి కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే కేంద్ర హోం మంత్రి కేంద్ర రక్షణ మంత్రి కూడా యుద్ధం గురించి ఎప్పటికప్పుడు కీలక ప్రకటనలు చేస్తున్నారు.
ఇక భారత ప్రజలు ఏది కోరుకుంటే అదే జరిగి తీరుతుందని తాజాగా రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ చేసిన ప్రకటనతో యుద్ధం అనివార్యం అన్నది తేలిపోయింది. పూర్తి స్థాయి యుద్ధ సన్నద్ధతతో భారత్ ఉందని అంటున్నారు.
ఇదిలా ఉంటే భారత్ పాక్ మధ్య యుద్ధం కనుక జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఒక వైపు చర్చగా ఉంది. మరో వైపు చూస్తే కనుక పాక్ లోని కీలక ప్రాంతాలను భారత్ టార్గెట్ చేసింది అని అంటున్నారు. ఇక భారత్ లోకి ఏ ఏ ప్రాంతాలకు యుద్ధం భయం ఉంది అన్నది కనుక చూస్తే కేంద్రం తాజాగా ఒక లిస్ట్ ని రిలీజ్ చేసింది.
అందులో యుద్ధం వస్తే ఎలా ప్రజలు దానిని ఎదుర్కోవాలి అన్న దాని మాక్ డ్రిల్ కోసం దేశవ్యాప్తంగా కొన్ని కీలక నగరాలు జిల్లాల పేర్లతో కూడిన జాబితాను ప్రకటించింది. మొత్తం మూడు కేటగిరీలుగా దేశంలో ఉన్న నగరాలను విభజించి ఎలా పాక్ కి టార్గెట్ అవుతాయన్నది కేంద్రం అంచనా కడుతోంది. మొదటి కేటగిరిల్లో ఢిల్లీ ఉంది. త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉన్నది ఢిల్లీలోనే. ఇక కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే ప్రధాని ఉండేది కూడా ఢిల్లీలోనే కాబట్టి అది ఫస్ట్ టార్గెట్ అవుతుంది అని అంటున్నారు. పాకిస్థాన్ అణు యుద్ధం అంటోంది కాబట్టి తారాపూర్ లోని న్యూక్లియర్ ప్లాంట్ ఉన్నది సైతం కేటగిరీ వన్ లోనే ఉంది.
మరో వైపు చూస్తే రాజస్థాన్ పంజాబ్ రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలు ఈ కేటగిరీ టూలో ఉన్నాయి. అదే విధంగా అసోం లోని చాలా ప్రాంతాలు బీహార్ లోని ప్రాంతాలు సైతం కేటగిరీ టూలో ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో చూస్తే తెలంగాణాలోని హైదరాబాద్ మహా నగరం, అలాగే ఏపీలోని విశాఖపట్నం కూడా కేటగిరీ టూలో ఉండడం ఇపుడు ఆసక్తిని సంచలనాన్ని రేపుతోంది.
ఇక పాక్ భారత్ మధ్య సుదీర్ఘ కాలం పాటు విడతల వారీగా యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక భారత్ పాకిస్థాన్ లోని ప్రధాన ప్రాంతాలను టార్గెట్ చేసి మరీ సమరానికి సిద్ధం అవుతోంది ఇక రష్యా విక్టరీ డే అన్నది మే 9న జరగనుంది. ఆ తరువాతనే పాకిస్థాన్ మీద యుద్ధం జరగనుంది అని అంటున్నారు
ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో విశాఖ డేంజర్ కేటగిరీలో ఉండడం అంటే అంతా ఆలోచిస్తున్నారు 1971లో కూడా పాకిస్థాన్ జల మార్గం ద్వారా విశాఖను ఎటాక్ చేయబోయింది. అయితే భారత మత్స్యకారులు పాక్ యుద్ధ నౌకను చూసి నేవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తూర్పు నావికాదళం సమర్ధంగా పాక్ నౌకను తిప్పికొట్టి సముద్రంలోనే తుత్తునియలు చేసి ఓడించింది.
దీంతో ఈసారి కూడా భారత్ పాక్ ల మధ్య యుద్ధం కనుక జరిగితే పాక్ చూపు కచ్చితంగా విశాఖ మీద ఉండొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే విశాఖలో రక్షణ శాఖకు సంబంధించిన అనేక కీలక స్థావరాలు ఉన్నాయన్నది తెలిసిందే. అలాగే బీచ్ రోడులో ఐఎన్ఎస్ కళింగ లో అనేక కీలక రక్షణ శాఖ వ్యవహారాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ మీద కూడా పాక్ కన్ను పడుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. దాంతో ఈ రెండు నగరాలను కేంద్రం పాక్ టార్గెటెడ్ సిటీలలో ఉండొచ్చు అని అంచనా కడుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.