Begin typing your search above and press return to search.

వరల్డ్ వ్యూహం... భారత్ కు వ్యూహాత్మకంగా స్వేచ్ఛనిస్తున్నారా?

తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన జేడీ వాన్స్... పాకిస్థాన్ పై భారత్ కు కొన్ని ఫిర్యాదులు ఉన్నాయని, న్యూఢిల్లీ చర్యలకు పాక్ స్పందిస్తోందని.

By:  Tupaki Desk   |   9 May 2025 8:57 PM IST
వరల్డ్  వ్యూహం... భారత్  కు వ్యూహాత్మకంగా స్వేచ్ఛనిస్తున్నారా?
X

భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దాయాదీని ఒంటరిని చేసి కొట్టాలనే వ్యూహంలో మోడీ ఉన్నారనే చర్చ సాగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా జరిగిన రెండు సంఘటనలు ఆ వాదనకు బలం చేకూరుస్తున్నాయని అంటున్నారు. అందులో ఒకటి అమెరికా వైఎస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రకటన కాగా.. రెండోది ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి ప్రకటన!

అవును... ప్రపంచ వ్యాప్తంగా తాజాగా రెండు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా... తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన జేడీ వాన్స్... పాకిస్థాన్ పై భారత్ కు కొన్ని ఫిర్యాదులు ఉన్నాయని, న్యూఢిల్లీ చర్యలకు పాక్ స్పందిస్తోందని.. పరిస్థితులు తగ్గుముఖం పట్టేలా చేయాలని మేము వీరిని ప్రోత్సహించగలం కానీ.. యుద్ధంలో మాత్రం తలదూర్చలేం అని అన్నారు.

మరోవైపు... సింధూజలాల ఒప్పందం అమలును భారత్ నిలిపేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సింధూ జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతోనే భారత్ - పాక్ ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... భారత్ - పాక్ మధ్య సింధూ జలాల పంపకాల విషయంలో జరిగిన ఒప్పందంలో ప్రపంచబ్యాంకు జోక్యం చేసుకుని.. ఎలా పరిష్కరిస్తుందనే దానిపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయని.. అయితే, అవన్నీ అర్ధం లేనివని అన్నారు. కాకపోతే ఈ బ్యాంక్ పాత్ర ఒక సహాయకుడిగా మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.

ఇక్కడ ఓ ఆసకికరమైన విషయం ఏమిటంటే... ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా... గురువారం మోడీతో భేటీ అయ్యారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ను కలిశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

దీంతో... మోడీ చాణక్యం ఫలితంగా... తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ ను మోరల్ గా కూడా దెబ్బతీసి, మరింత ఒంటరిని చేసేలా వరల్డ్ వ్యూహం నడుస్తుందా.. లేక, భారత్ కు ఎలాంటి ఆటంకాలు, నియమాలు లేని స్వేచ్ఛను ఇసుందా అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు.