Begin typing your search above and press return to search.

ఉద్రిక్తతల వేళ ఏమి చేయకూడదో చెబుతున్న రాజమౌళి!

అవును... భారత్ – పాక్ నడుమ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రజలు ఏమేమి చేయకూడదో చెప్పారు రాజమౌళి.

By:  Tupaki Desk   |   9 May 2025 5:39 PM IST
ఉద్రిక్తతల వేళ ఏమి చేయకూడదో చెబుతున్న రాజమౌళి!
X

భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా భారత్ పై పాక్ క్షిపణి ప్రయోగాలు చేయడంతో గురువారం దాయాదీ దేశ నగరాలు చిగురుటాకులా వణికిపోయాయని అంటున్నారు. మరోవైపు భారత్ భూభాగంలో ఒక అంగులమైనా ధ్వంసం చేయాలని పాక్ విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. భారత సైన్యం తిప్పి కొడుతూనే ఉంది.

ఆ విధంగా సైన్యం తనపని తాను చేస్తోన్న వేళ.. భారత ప్రభుత్వం పౌరులకు పలు సూచనలు చేస్తుంది. ఉద్రిక్తల వేళ ప్రభుత్వం చెప్పే సూచనలు పాటించాలని చెబుతోంది. మరోపక్క తప్పుడు సమాచారాన్ని షేర్ చేయొద్దని హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రజలకు కీలక సూచనలు చేశారు. మనం ఏమి చేయకూడదో చెప్పారు!

అవును... భారత్ – పాక్ నడుమ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రజలు ఏమేమి చేయకూడదో చెప్పారు రాజమౌళి. ఇందులో భాగంగా... ఒకవేళ భారత సైనిక చర్యలను చూస్తే.. ఫోటోలు, వీడియోలు తీయవద్దని.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని.. అలా చేస్తే.. శత్రువుకు సాయం చేసినట్లేనని రాజమౌళి తెలిపారు.

ఇదే సమయంలో... ఎటువంటి అనధికారిక ప్రకటనలు చేయవద్దని చెప్పిన దర్శకధీరుడు.. అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. నిశ్శబ్ధంగా, అప్రమత్తంగా, సానుకూలంగా ఉంటే విజయం మనదేనని పేర్కొన్నారు.

మరోవైపు నేషనల్ క్రష్ రష్మిక ఇన్ స్టా స్టోరీలో ఆసక్తికరమైన పొస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా... "ఉగ్రవాద చర్యల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోయినప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడం అనేది బాధ్యతే అవుతుంది తప్ప.. అవకాశం కాదు. శాంతిని కోరుకోవడం అంటే.. జరిగిన హానిని మౌనంగా అంగీకరించడం కానే కాదు" అని రాసుకొచ్చారు.