Begin typing your search above and press return to search.

పాక్‌తో జల సంధి రద్దు చేసిన భారత్.. అసలు మనకు ఏయే దేశాలతో ఒప్పందాలున్నాయి

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26మంది పర్యాటకులు మరణించిన నేఫథ్యంలో భారత్ పాకిస్థాన్‌పై తీవ్ర చర్యలు చేపట్టింది.

By:  Tupaki Desk   |   25 April 2025 2:00 AM IST
పాక్‌తో జల సంధి రద్దు చేసిన భారత్.. అసలు మనకు ఏయే దేశాలతో ఒప్పందాలున్నాయి
X

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26మంది పర్యాటకులు మరణించిన నేఫథ్యంలో భారత్ పాకిస్థాన్‌పై తీవ్ర చర్యలు చేపట్టింది. ఈ ఉగ్రదాడిలో పాకిస్థాన్ కుట్ర ఉందని తేలడంతో భారత్ ఐదు కీలక నిర్ణయాలు తీసుకుని పాక్‌కు దాని భాషలోనే సమాధానం చెప్పడం మొదలు పెట్టింది. ఈ నిర్ణయాలలో అత్యంత ముఖ్యమైనది 1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన సింధు జల సంధిని రద్దు చేయడం. సరిహద్దు నుండి ఉగ్రవాదానికి మద్దతు పూర్తిగా నిలిచిపోయే వరకు ఈ కీలకమైన జల సంధిని తక్షణమే నిలిపేస్తున్నట్లు భారత్ ప్రకటించింది.

సింధు జల సంధి ప్రకారం.. పాకిస్థాన్‌కు చీనాబ్, జీలం, సింధు నదుల నీరు అందుతోంది. పాకిస్థాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రావిన్స్‌లలోని రైతులు వ్యవసాయం, ఇతర నీటి అవసరాల కోసం పూర్తిగా ఈ నదుల నీటి మీదనే ఆధారపడి ఉన్నారు. అయితే, ఇక్కడ మనం భారతదేశం ఇతర అంతర్జాతీయ జల సంధుల గురించి తెలుసుకుందాం. పాకిస్థాన్‌తో కాకుండా భారత్ ఇతర ఏ దేశాలతో నీటి పంపకం గురించి ఒప్పందాలు చేసుకుందో చూద్దాం.

భారత్-బంగ్లాదేశ్ జల సంధి

భారత్, బంగ్లాదేశ్ మధ్య 1996లో గంగా జల సంధి జరిగింది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య గంగా నది నీటి పంపకంపై ఉన్న వివాదాలను పరిష్కరించాలన్నది దీని ఉద్దేశం. అప్పటి ప్రధాన మంత్రి హెచ్‌డి దేవెగౌడ, షేక్ హసీనా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం 30 సంవత్సరాల కాలానికి వర్తిస్తుంది.

మహాకాళి జల సంధి

భారత్, నేపాల్ మధ్య 1996లో మహాకాళి నదికి సంబంధించి జల ఒప్పందం జరిగింది. దీనిని మహాకాళి జల సంధి అని పిలుస్తారు. ఈ జల సంధిలో సదరా బ్యారేజ్, తనక్‌పూర్ బ్యారేజ్, పంచేశ్వర్ ప్రాజెక్ట్ వంటివి ఉన్నాయి.

భారత్-చైనా ఒప్పందం

భారత్, చైనా మధ్య బ్రహ్మపుత్ర నదిపై వర్షపు నీరు, నీటి మట్టం వంటి హైడ్రోలాజికల్ సమాచారాన్ని పంచుకోవడానికి ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఐదు సంవత్సరాల కాలానికి కుదిరింది. అయితే, రెండు దేశాల మధ్య అధికారికంగా ఎటువంటి జల సంధి లేదు.

పాక్ జల సంధి

భారతదేశంలోని తమిళనాడు, శ్రీలంకలోని ఉత్తర ప్రావిన్స్‌లోని జాఫ్నా జిల్లా మధ్య ఒక జల సంధి ఉంది. ఈ జల సంధి ఈశాన్యంలో పాక్ అఖాతాన్ని నైరుతిలో మన్నార్ అఖాతంతో కలుపుతుంది.