అతి పెద్ద చర్చ : అణు యుద్ధం వస్తుందా ?
అయితే అణు యుద్ధం కడు ప్రమాదకరం. అది ఏకంగా మారణ హోమమే సృష్టిస్తుంది. దానికి ఇప్పటికి 80 ఏళ్ళ క్రితం జపాన్ లోని హిరోషిమా నాగసాకీల మీద పడిన అణు బాంబులే సాక్ష్యమని అంటుంటారు.
By: Tupaki Desk | 10 May 2025 6:00 AM ISTఈ రోజున ప్రపంచం మొత్తం ఘర్షణల్లో నిండి ఉంది. ఎవరికి వారుగా తాము అభివృద్ధి చెంది సుఖపడలేక పక్కవారిని కెలుకుతూ చాలా సులువుగా యుద్ధాలను తెస్తున్నారు. భారత్ కి పాక్ తో సమస్యలు ఈనాటివి కావు. పాక్ ఆవిర్భవించిన తర్వాత నుంచి అనుకోవాలి. భారత్ నుంచి వేరుపడిపోతామని చెప్పిందే ఒక వర్గం. వారు కోరుకున్నట్లుగానే దేశం ముక్కలు అయింది.
ఆ తర్వాత ఎవరి బతుకు వారు అన్నట్లుగా ఉండాలి. కానీ పాక్ ఆగస్టులో విడిపోయి అక్టోబర్ నాటికల్లా కాశ్మీర్ మీద యుద్ధం ప్రకటించింది. అలా మూడవ వంతు భూభాగాన్ని తీసుకుని ఈ రోజుకీ అక్కడ దర్జా చేస్తోంది దానికి ఉగ్రవాదులకు స్వర్ఘధామంగా మార్చి భారత్ మీదకు ఉసిగొలుపుతోంది. ఇదిలా ఉంటే భారత్ ఎపుడూ తానుగా ఏ దేశం మీదకు యుద్ధానికి వెళ్ళదు.
తన మీదకు ఎవరైనా దాడి చేస్తే ప్రతి దాడికి వెళ్తుంది. అది తెలిసి పాక్ భారత్ ని పదే పదే కవ్విస్తూ ఉంటుంది. పహల్గాం దాడి అందులో భాగమే. ఇక భారత్ ఎంతో సంయమనం పాటిస్తూ వచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్ లోని ఉగ్ర వాద శిబిరాల మీదనే దాడి చేసింది. అది కూడా ఎక్కడా ఒక పౌరుడి ప్రాణం కానీ ఆస్తి కానీ నష్టపరచుకుండా చేసింది.
అయితే అదే తప్పు అయిపోయినట్లుగా భారత్ మీద పాక్ యుద్ధాన్ని ప్రకటిస్తోంది దాంతో భారత్ కూడా ప్రతి దాడులు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ చేతిలో పాక్ చావు దెబ్బ తింటోంది. ఎంత పెద్ద ఎటాక్ చేసినా దానిని భారత్ వైపు నుంచి నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు. దీంతో దాయాదిలో అసహనం అంతకంతకు పెరిగిపోతోంది.
ఏమి చేయాలో తెలియక ప్రతీకారేచ్ఛతో రగులుతోంది. ఇదిలా ఉంటే తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని పాక్ పదే పదే బెదిరిస్తూ వస్తోంది. తాము వాటిని భారత్ కోసమే సిద్ధం చేసి ఉంచుకున్నామని వంకర మాటలు అనేకం మాట్లాడుతూ వస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే పాక్ ఒక్కటే అవతల వైపు నుంచి యుద్ధం లో పాల్గొంటే దాని ఆలోచనల వరకూ అయితే ఫర్వాలేదు.
కానీ దానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మరో దేశం కనుక కలిసి వస్తే అపుడు యుద్ధ స్వరూపమే మారిపోతుంది అని అంటున్నారు. ఒకనాడు సంప్రదాయ పద్ధతిలో యుద్ధం జరిగేది. ఇపుడు టెక్నాలజీ సాయంతో యుద్ధం చేస్తున్నారు. ఇక ముందు ఏమిటి అంటే అణ్వాయుధాల వాడకమే అని అంటున్నారు.
అయితే అణు యుద్ధం కడు ప్రమాదకరం. అది ఏకంగా మారణ హోమమే సృష్టిస్తుంది. దానికి ఇప్పటికి 80 ఏళ్ళ క్రితం జపాన్ లోని హిరోషిమా నాగసాకీల మీద పడిన అణు బాంబులే సాక్ష్యమని అంటుంటారు. అణు బాంబులు కనుక ఏ దేశం ప్రయోగించినా దాని దుష్పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ దేశం పూర్తిగా నష్టపోతుంది. అక్కడ భూభాగం సర్వనాశనం అవుతుంది. కనీసం పచ్చని మొక్క మొలవడానికి సైతం చాలా కాలం పడుతుంది.
ఇక అణు బాంబు ప్రయోగిస్తే కనుక దాని రేడియేషన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కిలోమీటర్ల దూరం వరకూ వ్యాపిస్తుంది. దానితో కూడా ప్రజలు ప్రాంతాలు పూర్తిగా నష్టపోతాయి. ఇవన్నీ ఆలోచించుకున్నపుడు ఎవరికైనా భయం కలుగుతుంది. భారత్ పాక్ ల మధ్య యుద్ధం అన్నది ఇపుడు జరుగుతోంది ట్రెడిషనల్ గా అని భావించకూడదు. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగినవే అని అంతా గుర్తు చేస్తున్నారు.
అయితే గత్యంతరం లేని పక్షంలో ఏ దేశం అయినా అణ్వాయుధాలను వాడుతుంది. పైగా అణ్వాయుధాలు వాడడడం అంటే మారణహోమాన్ని కోరి ఆహ్వానించడమే. ఉన్మాద మనస్తత్వంలో ఉన్న వారు అలాగే చేస్తారు. బాధ్యతాయుతమైన వారు ఆ పరిస్థితి తెచ్చుకోరు. మరి పాక్ లో బాధ్యత ఎంత వరకు ఉంది అన్నది చూస్తే అందరికీ అక్కడే అనుమానాలు వస్తున్నాయి.
ఏది ఏమైనా భారత్ పాక్ ల మధ్య యుద్ధం ఈసారి భీకరంగానే సాగుతుంది అని అంటున్నారు. పాక్ అనే సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని భారత్ చూస్తోంది. అదే విధంగా భారత్ ని గతంలో కంటే ఎక్కువగా దెబ్బతీయాలని పాక్ తన పగతో ఆలోచిస్తోంది. సో ఈ యుద్ధం ఎంతవరకూ సాగుతుంది ఏ పరిణామాలకు దారి తీస్తుంది అన్నది మాత్రం ఎవరూ ఊహించలేకుండా ఉన్నారు.