పహల్గామ్ దాడి దర్యాప్తు NIAకి అప్పగింత..42 పాక్లో ఆ బాధ్యత ఎవరిది?
పాకిస్తాన్లో ఉగ్రదాడుల దర్యాప్తు, సరిహద్దు నియంత్రణ, నేర దర్యాప్తును ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) ఉంది.
By: Tupaki Desk | 27 April 2025 3:03 PM ISTపహల్గామ్లో జరిగిన ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఉగ్రదాడి మీద దర్యాప్తును ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం NIA అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది. NIA ఈ విషయంలో చురుగ్గా ఉంది. దర్యాప్తు సంస్థ ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనుంది. దీని కోసం NIA స్థానిక పోలీసుల నుండి పహల్గామ్ దాడికి సంబంధించిన కేస్ డైరీ, FIRలను కూడా తీసుకోనుంది. అయితే అంతకు ముందు కూడా NIA చురుకుగా ఉండి పహల్గామ్లోని సంఘటనా స్థలాన్ని పరిశీలించింది.
ఏప్రిల్ 22న జరిగిన ఈ ఉగ్రదాడిలో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. అందుకే భారత్ పాకిస్తాన్పై పెద్ద చర్య తీసుకుంటూ సింధు జలాల ఒప్పందం ప్రకారం నీటిని నిలిపివేసింది. దీనితో పాటు మరో నాలుగు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారతదేశం తీసుకున్న ఈ చర్యలతో పాకిస్తాన్ కలవరపడుతోంది. భారత్లో NIA ఉగ్రదాడిని దర్యాప్తు చేస్తున్నట్లే, పాకిస్తాన్లో ఇలాంటి దాడులను దర్యాప్తు చేసే సంస్థ ఏదో ఈ కథనంలో తెలుసుకుందాం.
పాకిస్తాన్లో ఏ సంస్థ దర్యాప్తు చేస్తుంది?
పాకిస్తాన్లో ఉగ్రదాడుల దర్యాప్తు, సరిహద్దు నియంత్రణ, నేర దర్యాప్తును ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) ఉంది. ఉగ్రవాదం, గూఢచర్యం, నేరాలు, అక్రమ రవాణాతో పాటు ఉల్లంఘనలు, ఇతర ప్రత్యేక నేరాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 1974లో పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం, ఈ సంస్థ అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
దీని విధులు ఏమిటి?
FIA ఇంటర్పోల్తో సన్నిహిత సహకారం, సమన్వయంతో అంతర్జాతీయ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఇస్లామాబాద్లో ఉంది. దీని వివిధ శాఖలు, ప్రాంతీయ కార్యాలయాలు పాకిస్తాన్ అంతటా అన్ని నగరాల్లో ఉన్నాయి. ఈ ఏజెన్సీ లక్ష్యం , ప్రాధాన్యత దేశ ప్రయోజనాలను రక్షించడం.. స్థానికంగా పాకిస్తాన్ ప్రయోజనాలను కాపాడటం. దీనితో పాటు దేశంలో నేర చట్టాన్ని పరిరక్షించడం, చట్టాన్ని అమలు చేయడం దీని విధుల్లో భాగం.
