Begin typing your search above and press return to search.

'సైరన్ల' విషయంలో మీడియా ఛానెళ్లకు కేంద్రం కీలక అడ్వైజరీ!

ప్రస్తుతం భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కేంద్రం పలు సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేస్తుంది.

By:  Tupaki Desk   |   10 May 2025 5:54 PM IST
సైరన్ల విషయంలో మీడియా ఛానెళ్లకు కేంద్రం కీలక అడ్వైజరీ!
X

ప్రస్తుతం భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కేంద్రం పలు సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగా... జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్థాన్ కు చెందిన అన్ని సినిమాలు, పాటలు, వెబ్ సిరీస్ లు, పాడ్ కాస్ట్ లను తక్షణమే తొలగించాల్సి ఉంటుందని ఐ&బీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న నేపథ్యంలో.. పాక్ నుంచి వచ్చే అన్ని కంటెంట్ లను నిలిపివేయాలని, ఇప్పటికే ఉన్నవాటిని తొలగించాలని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్, స్ట్రీమర్ లను ఆదేశించింది. ఇదే సమయంలో సోషల్ మీడియా పోస్టుల విషయలోనూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా న్యూస్ ఛానల్స్ కు అడ్వైజరీ జారీ చేసింది.

అవును... భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న వేళ పౌరులను అప్రమత్తం చేయడానికి వినియోగించే సైరన్ లను వార్తా కార్యక్రమాల్లో ఉపయోగించొద్దని మీడియా ఛానెళ్లకు కేంద్రం సూచించింది. కేవలం మాక్ డ్రిల్ ల సమయంలో పౌరులకు అవగాహన కోసమే వినియోగించాలని పేర్కొంటూ అడ్వైజరీ జారీ చేసింది.

ఇలా అస్తమానం ఈ శబ్ధాలు వినిపిస్తే ప్రజల్లో గందరగోళానికి దారితీస్తాయని.. నిజంగా అత్యవసర సమయాల్లో వీటిని వినియోగించినప్పుడు పౌరులు వీటిని తేలికగా తీసుకునే ప్రమాదం ఉందని ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోంగార్డ్స్ విభాగాలు అడ్వైజరీ జారీ చేశాయి.