Begin typing your search above and press return to search.

రాజస్థాన్‌ లో కుప్పకూలిన జాగ్వార్ యుద్ధ విమానం... ఏం జరిగింది?

అవును... రాజస్థాన్‌ లోని చురు జిల్లాలోని భానుడా గ్రామం సమీపంలో బుధవారం జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయిందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   9 July 2025 3:23 PM IST
రాజస్థాన్‌ లో కుప్పకూలిన జాగ్వార్ యుద్ధ విమానం... ఏం జరిగింది?
X

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) కు చెందిన జాగ్వార్‌ యుద్ధ విమానం కూలిపోయిందని తెలుస్తోంది. రాజస్థాన్‌ లోని చురు జిల్లాకు చెందిన భానుడా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. అయితే... ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారని అంటున్నారు.

అవును... రాజస్థాన్‌ లోని చురు జిల్లాలోని భానుడా గ్రామం సమీపంలో బుధవారం జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో వైమానిక దళ పైలట్ మరణించినట్లు జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈ విమానం సూరత్‌ గఢ్ వైమానిక స్థావరం నుండి బయలుదేరిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సమయంలో సహాయక చర్యల నిమిత్తం పోలీసు బృందాలను ఘటనా స్థలానికి పంపినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన స్థానిక స్టేషన్ ఎస్.హెచ్.ఓ. కమలేష్... క్రాష్ సైట్ సమీపంలో మానవ అవశేషాలు కనుగొనబడ్డాడని.. అయితే ప్రాణనష్టానికి సంబంధించి ఐఏఎఫ్ నుండి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉందని అన్నారు!

కాగా... ఈ సంవత్సరం జాగ్వార్ విమానం కూలిపోవడం ఇది రెండవసారి అనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌ లో గుజరాత్‌ లోని జామ్‌ నగర్ వైమానిక దళ స్టేషన్ సమీపంలోని శిక్షణా కార్యక్రమంలో ఐఏఎఫ్ జాగ్వార్ కూలిపోయింది. ఆ విమానం జామ్‌ నగర్ కు సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సువర్దా గ్రామం సమీపంలోని మైదానంలో కూలిపోయింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లలో ఒకరు సురక్షితంగా బయటపడగలిగారు! ఇందులో భాగంగా.. పైలట్లలో ఒకరైన సిద్ధార్థ్ యాదవ్ తన కో-పైలట్‌ ను సకాలంలో బయటకు పంపించడంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే దురదృష్టవశాత్తు యాదవ్ సకాలంలో జెట్ నుండి బయటకు రాలేకపోయాడు.