Begin typing your search above and press return to search.

ఈ సూసైడ్ తెలిస్తే దరిద్రం పోయిందనుకుంటారు

ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో షాకింగ్ నేర ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటిదే తాజా ఉదంతం

By:  Tupaki Desk   |   7 Sep 2023 4:15 AM GMT
ఈ సూసైడ్ తెలిస్తే దరిద్రం పోయిందనుకుంటారు
X

ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో షాకింగ్ నేర ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటిదే తాజా ఉదంతం. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారంటే.. అయ్యో అనుకుంటాం. కానీ.. ఇప్పుడు చెప్పే ఉదంతం గురించి తెలిస్తే మాత్రం.. పీడ పోయిందని అనుకోవటం ఖాయం. అంతలా మనసు విరిగిపోయే ఈ ఉదంతాన్ని సింఫుల్ గా చెప్పాలంటే.. అన్న భార్యను పెళ్లి చేసుకోమ్మంటూ అదే పనిగా ఒత్తిడి తెస్తుంటే.. నో అన్నదన్న కోపంతో మరిది ఆత్మహత్య చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. అసలేం జరిగిందంటే..

బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఆత్మహత్య జీర్ణించుకోలేనిదిగా మారింది.హర్యానా రాష్ట్రానికి చెందిన జితేందర్ కొంతకాలంగా స్థానికంగా ఉంటూ.. పనులు చేసుకుంటున్నాడు. తమ రాష్ట్రానికి చెందిన ప్రదీప్.. షఖీల్ తో అతడికి పరిచయమైంది. ప్రదీప్ పెద్దమ్మ కొడుకు (వరసకు అన్న) అయిన వ్యక్తి భార్యతో అతడికి పరిచయమైంది. దీంతో.. వాళ్లింటికి తరచూ వెళ్లేవాడు.

ఈ క్రమంలో అన్న భార్యతో్ వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి అన్నను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు ప్రదీప్. అయితే.. అందుకు ఆమె అంగీకరించలేదు. బుధవారం ఆమెకు ఫోన్ చేసిన ప్రదీప్.. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే చచ్చిపోతానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆమె.. భర్తకు విషయాన్ని చెప్పింది.

వెంటనే స్పందించిన ఆమె భర్త.. తన స్నేహితులకు విషయాన్ని చెప్పి.. వెంటనే అతడి రూంకు వెళ్లి చూడాలని చెప్పాడు. వారు వెళ్లే సరికి ప్రదీప్ ఇంట్లోని గదిలోని ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న బోయిన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.