Begin typing your search above and press return to search.

రూ.200 కోట్ల ఆస్తి దానం.. భిక్షాటన చేస్తున్న జంట!

గుజరాత్ కు చెందిన ఒక సంపన్న కుటుంబానికి చెందిన దంపతులు అధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

By:  Tupaki Desk   |   16 April 2024 4:41 AM GMT
రూ.200 కోట్ల ఆస్తి దానం.. భిక్షాటన చేస్తున్న జంట!
X

సంపద లేదని.. దాని కోసం అర్రులు జాసే కోట్లాది మందిని చూస్తుంటాం. కానీ.. ఇప్పుడు మేం పరిచయం చేసే వారు అందుకు భిన్నం. ఇలాంటి వారు కోట్లల్లో ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. సంపదను త్రుణప్రాయంగా వదిలేసి.. సాదాసీదాగా బతికేందుకు సిద్ధం కావటమే కాదు.. రోజువారీ జీవితాన్ని భిక్షాటనకు వెచ్చించే సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న సంపన్న దంపతుల గురించి తెలిస్తే నోట మాట రాదంతే.

గుజరాత్ కు చెందిన ఒక సంపన్న కుటుంబానికి చెందిన దంపతులు అధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న రూ.200 కోట్ల సంపదను దానం చేశారు. అంతేకాదు జైన సన్యాసం స్వీకరించి.. సాదాసీదాగా బతికేందుకు సిద్ధమయ్యారు. హిమ్మత్ నగర్ కు చెందిన వ్యాపారవేత్త భవేశ్. ఆయన.. ఆయన సతీమణికి 19ఏళ్ల కుమార్తె.. 16 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వారు 2022లో జైన సన్యాసం తీసుకున్నారు.

వారి నుంచి ప్రేరణ పొందిన భవేశ్ దంపతులు పిల్లల మార్గంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. గత ఫిబ్రవరిలో నిర్వహించిన ఒక ప్రోగ్రాంలో తమ సంపద మొత్తాన్ని దానం చేశారు. ఈ నెల 22న వారు జైన సన్యాసాన్ని స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు.

జైన సన్యాసం స్వీకరించిన తర్వాత నుంచి వారు రెండు తెల్లటి వస్త్రాలు.. చీపురు లాంటి రజోహరన్ ను తీసుకొని.. భిక్షం ఎత్తుకునేందుకు ఒక పాత్రను తమతో ఉంచుకుంటారు. కాళ్లకు చెప్పులు లేకుండా దేశ పర్యటన చేస్తూ భిక్షను స్వీకరిస్తూ ఉంటారు. అన్నీ ఉన్నా.. ఆధ్మాత్మిక మార్గంలోకి పయనించేందుకు వారు సిద్ధమైన త్యాగం షాకింగ్ గా మారుతుందనటంలో సందేహం లేదు.