గిన్నిస్ బుక్ రూల్ మార్పు.. మానవ ఆరోగ్యమే ముఖ్యమంటూ సంచలన నిర్ణయం!
మానవ శరీర సామర్థ్యాన్ని పరీక్షించే ఎన్నో చిత్ర విచిత్రమైన రికార్డులను 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' నమోదు చేస్తుంది. అయితే, కొన్ని రికార్డులు మనుషుల ప్రాణాలకు ముప్పు తెచ్చేవిగా మారడంతో గిన్నిస్ బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 26 May 2025 4:30 PMమానవ శరీర సామర్థ్యాన్ని పరీక్షించే ఎన్నో చిత్ర విచిత్రమైన రికార్డులను 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' నమోదు చేస్తుంది. అయితే, కొన్ని రికార్డులు మనుషుల ప్రాణాలకు ముప్పు తెచ్చేవిగా మారడంతో గిన్నిస్ బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. తక్షణమే వాటిని ఆపేయాలని 'గిన్నిస్ బుక్' ప్రతినిధులు నిర్ణయించారు. అలాంటి వాటిలో ఒకటి.. మనిషి నిద్రపోకుండా ఎన్ని రోజులు బతకగలడు? అనే రికార్డు. ఈ రికార్డును నమోదు చేయడాన్ని 'గిన్నిస్ బుక్' 1997లోనే పూర్తిగా నిలిపివేసింది. ఎందుకంటే, ఇలాంటి ప్రయత్నాలు మనుషుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి.
నిద్ర అనేది మనిషి శరీరానికి, మెదడుకు చాలా అవసరం. తగినంత నిద్ర లేకపోతే శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. నిద్రలేమి వల్ల ఏకాగ్రత లోపించడం, మానసిక గందరగోళం, భ్రాంతులు, హృదయ సంబంధ సమస్యలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ రికార్డు కోసం ప్రయత్నించేవారు తమ శరీరాలపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చుకుంటారు. అది ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే, మానవ ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని 'గిన్నిస్ బుక్' ఈ ప్రమాదకరమైన రికార్డును ఆపేసింది.
నిద్రపోకుండా అత్యధిక కాలం మేల్కొని ఉన్న వ్యక్తిగా ఇప్పటికీ రాబర్ట్ మెక్డొనాల్డ్ రికార్డు పేరు మీద ఉంది. అతను 1986లో ఏకధాటిగా 18 రోజులు, 21 గంటలు, 40 నిమిషాల పాటు నిద్రపోకుండా మేల్కొని ఉన్నాడు. ఈ రికార్డును ఇప్పటికీ ఎవరూ బద్దలు కొట్టలేదు. ఎందుకంటే 'గిన్నిస్ బుక్' ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలను అనుమతించడం లేదు. ప్రస్తుతం, 'గిన్నిస్ బుక్' ఇలాంటి ప్రమాదకరమైన రికార్డుల కంటే, మానవ సామర్థ్యాన్ని సానుకూలంగా, సురక్షితంగా ప్రదర్శించే రికార్డుల నమోదుపైనే దృష్టి పెడుతోంది.