Begin typing your search above and press return to search.

వ‌న్స్ ఎగెయిన్ జ‌గ‌న్ ... సాధ్య‌మేనా ..!

రాష్ట్రంలో పాల‌న ప్రారంభించిన ప‌ది మాసాల్లోనే కూట‌మి స‌ర్కారు ప్ర‌జ‌ల‌కు చేరువైంది. కొన్ని కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు.

By:  Tupaki Desk   |   24 April 2025 9:30 AM
వ‌న్స్ ఎగెయిన్ జ‌గ‌న్ ... సాధ్య‌మేనా ..!
X

రాష్ట్రంలో పాల‌న ప్రారంభించిన ప‌ది మాసాల్లోనే కూట‌మి స‌ర్కారు ప్ర‌జ‌ల‌కు చేరువైంది. కొన్ని కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు. కానీ, ప్ర‌ధాన నాయ‌కులు మాత్రం ప్ర‌జ‌ల‌కు చేరువ‌గానే ఉన్నారు. పిలిస్తే ప‌లుకుతున్నారు. పిల‌వ‌కుండానే.. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్ర‌జాక్షేత్రంలోనే ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది.. కూట మికి క‌లిసి వస్తున్న విష‌యం.

దీం తో క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు, అధికారుల‌పై కొంత అసంతృప్తి ఉన్న‌ప్ప‌టికీ.. వాటిని తుడిచి పెట్టే విధంగా సీఎం, డిప్యూటీ సీఎం వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇది.. కూట‌మికి మేలు చేస్తుండ‌గా.. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. గెలుపు మాదేన‌ని.. వ‌న్స్ ఎగెయిన్ జ‌గ‌న్‌! అని ప్ర‌వ‌చిస్తున్న వైసీపీకి మాత్రం డేంజ‌ర్ బెల్స్ మోగిస్తున్నాయి. దీని నుంచి బ‌య‌ట‌ప‌డాల్సి న అవ‌స‌రం త‌క్ష‌ణ‌మే ఉంద‌న్న‌ది పార్టీ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. కూట‌మి అధికారంలో ఉన్న‌ప్పుడు తేడా ఉంద‌ని చెబుతున్నా రు.

క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు వ‌చ్చే ఇబ్బందుల‌ను ప‌ట్టించుకునే ఉన్నా.. లేకున్నా.. పైస్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి వారు.. త‌మకు త‌ర‌చుగా క‌నిపిస్తుంటే.. ప్ర‌జ‌ల్లో ఉండే జోష్ వేరు. ఈ విష‌యంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న జ‌గ‌న్‌... వెనుకంజ వేశారు. తాము ఇస్తున్న ప‌థ‌కాలు.. బ‌ట‌న్ నొక్కుళ్ల‌కు మించిన బ్రహ్మాండ‌మైన రాజ‌కీయాలు ఎవ‌రు మాత్రం చేయ‌గ‌ల‌ర‌ని అనుకున్నారు. కానీ, ఇది బెడిసి కొట్టింది. క‌ష్టంలో ఉన్న‌వారికి స్వాంత‌న‌కు మించిన ప‌థ‌క ఔష‌ధం లేద‌న్న విధంగా సీఎం వ‌చ్చి ఊర‌డిస్తే ఉండే రిఫ్లెక్ష‌న్ వేరేగా ఉంటుంది.

ఇది జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టారు. ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించారు. ఫ‌లితంగా.. 151 నుంచి 11కు ప‌డిపోయారు. ఇక‌, ఇప్పుడు కూడా పైపై మెరుగుల‌కు మాత్ర‌మే ప్రాధాన్యం ఇస్తున్నారు. నాయ‌కులు చెప్పింది.. సొంత మీడి యాలో వ‌చ్చింది మాత్ర‌మే విశ్వ‌సిస్తున్నారు. ఫ‌లితంగా కూట‌మి స‌ర్కారుపై ఏదో ప్ర‌జా వ్య‌తిరేక‌త పెరిగింద‌ని,... త‌మ‌కు అధికారం వ‌చ్చేస్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. కానీ, వాస్త‌వానికి.. క్షేత్ర‌స్థాయిలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు ఒక‌టి రెండు సార్లు తిరిగి.. ఊర‌డిస్తే.. ప్ర‌జ‌ల మ‌న‌సులు.. ఓట్లు కూడా.. వారికే అనుకూలంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. కాబ‌ట్టి.. జ‌గ‌న్ వ‌న్స్ ఎగెయిన్‌.. అంత తేలిక కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.