Begin typing your search above and press return to search.

విమానంలో మందుబాబులు... మద్యలో దింపేసిన పైలట్!

అవును... దుబాయ్‌ నుంచి కొచ్చికి బయలుదేరిన ఓ విమానంలో నలుగురు ప్రయాణికులు మద్యం మత్తులో హల్ చల్ చేశారు.

By:  Tupaki Desk   |   25 Aug 2023 6:51 AM GMT
విమానంలో మందుబాబులు... మద్యలో దింపేసిన పైలట్!
X

విమానాల్లో ప్రయాణిస్తున్న సమయంలో మందు బాబులు చేసే హడావిడి అంతా ఇంతా కాదని నిరూపించే సంఘటనలు ఇప్పటికే చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా విమానంలో మందుబాబులు చేసిన హల్ చల్ కు శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్.

ఈమధ్యకాలంలో విమనాల్లో జరుగుతున్న అసభ్యకరమైన పనులు, సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. గాల్లో రయ్ మంటూ దూసుకుపోతున్న విమానంలో తాగినోళ్లు తాగినట్లుండకుండా చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. వీరిలో తాగి మహిళపై మూత్రం పోసిన మందుబాబుల సంగతి కూడా తెలిసిందే.

తాగి ఎయిర్ హోస్టెస్ ను వేదించడం.. విమానం ఆకాశంలో ఉన్న సమయంలో డోర్ తెరవడానికి ప్రయత్నించడం.. సీట్లోనే మూత్ర విసర్జనకు పాల్పడటం.. తాను కూర్చున్న సీటు కింద మల విసర్జనకు ఉపక్రమించడం.. పక్కసీట్లో ఉన్న వారితో అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఎన్నో సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే వెలుగు చూశాయి.

ఈ క్రమంలో తాజాగా నలుగురు మందుబాబులు విమానంలో హల్ చల్ చేశారు. వీరు చేసిన హడావిడికి మిగతా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో... పైలట్ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

అవును... దుబాయ్‌ నుంచి కొచ్చికి బయలుదేరిన ఓ విమానంలో నలుగురు ప్రయాణికులు మద్యం మత్తులో హల్ చల్ చేశారు. ఇందులో భాగంగా తోటి ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించారు. ఇదేమని అడిగిన సిబ్బందిపై, ఇతర ప్రయాణికులపై దాడికి యత్నించారు.

దీంతో పరిస్థితి చేయిదాటిపోయేలా ఉందని గ్రహించారో ఏమో కానీ... విమానాన్ని పైలట్‌ దారిమళ్లించారు. ఇందులో భాగంగా... శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ఈ మేరకు విషయాన్ని ఎయిర్‌ పోర్ట్‌ అధికారులు వెల్లడించారు.

ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం ఆ నలుగురు మందుబాబులనూ భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ స్టేషన్ పోలీసులు తెలిపారు.