Begin typing your search above and press return to search.

తొలి ద‌శ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ రాష్ట్రాల్లో వ‌చ్చే నెల 19 పోలింగ్‌

+ రాష్ట్రపతి తరపున ఎన్నికల సంఘం తాజాగా తొలిద‌శ‌కు సంబంధించిన ఎన్నిక‌ల‌ నోటిఫికేషన్ జారీ చేసింది.

By:  Tupaki Desk   |   20 March 2024 10:05 AM GMT
తొలి ద‌శ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ రాష్ట్రాల్లో వ‌చ్చే నెల 19 పోలింగ్‌
X

దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక స‌మ‌రానికి సంబంధించి ఇప్ప‌టికే షెడ్యూల్ విడుద‌ల చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం .. ఏడు ద‌శ‌ల్లో వీటిని నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. ఇక‌, తాజాగా తొలి ద‌శ‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం.. తొలి ద‌శ‌లో వ‌చ్చే 19న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక‌, బుధ‌వారం నుంచి తొలి ద‌శ ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో అభ్య‌ర్థుల నుంచి నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు.

+ రాష్ట్రపతి తరపున ఎన్నికల సంఘం తాజాగా తొలిద‌శ‌కు సంబంధించిన ఎన్నిక‌ల‌ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ పత్రాలను బుధ‌వారం నుంచి మార్చి 27వ తేదీ వ‌ర‌కు స‌మ‌ర్పించేందుకు అవ‌కాశం ఇచ్చింది. అయితే బీహార్‌లో 27న పండుగ ఉండడంతో 28 వరకు ఎలక్షన్ కమిషన్ నామినేష‌న్ల‌ను అవకాశం కల్పించింది.

+ తొలి ద‌శకు సంబంధించి మార్చి 28 నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. బీహార్‌లో మార్చి 30న పరిశీలన ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 30. బీహార్‌లో ఏప్రిల్ 2 వరకు అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌తో లోక్‌సభ ఎన్నికల తొలి దశ ఎన్నికల ప్రక్రియ మొదలైంది.

+ తొలి ద‌శ‌లోనే దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది.

+ అత్యధికంగా తమిళనాడులో 39 ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు.

+ రాజస్థాన్‌లో 12 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 5 స్థానాల చొప్పున, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో 2 సీట్ల చొప్పున, ఛత్తీస్‌గడ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది.