హాస్పటల్ కి పాక్ పై మోడీ స్టేట్ మెంట్... ఈ వైద్యుడి వాడకం పీక్స్ అంతే!
తాజాగా ఓ వైద్యుడు ఏకంగా... పాకిస్థాన్ పై సింధు నదీ జలాల పంపకానికి సంబంధించిన అగ్రిమెంట్ రద్దు విషయంలో ఇచ్చిన స్టేట్ మెంట్ ను తన హాస్పటల్ కి వాడేశారు
By: Tupaki Desk | 17 May 2025 7:08 AMవాడకంలయందు కొంతమంది వాడకం వేరే రేంజ్ లో ఉంటుందని అంటారు. తాజాగా ఓ వైద్యుడు ఏకంగా... పాకిస్థాన్ పై సింధు నదీ జలాల పంపకానికి సంబంధించిన అగ్రిమెంట్ రద్దు విషయంలో ఇచ్చిన స్టేట్ మెంట్ ను తన హాస్పటల్ కి వాడేశారు. దీనిపై అధికారులు కీలక నిర్ణయం తీసుకుని, మళ్లీ ఇలాంటివి వాడాలనే ఆలోచన రాకుండా చేశారు!
అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పలు దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. సింధూ నదీ జలాల విషయంలో ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై స్పందించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ... నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని పాక్ కు అర్ధమయ్యేలా చెప్పారు!
కట్ చేస్తే... ఈ స్టేట్ మెంట్ ను ఛత్తీస్ గఢ్ లోని ఓ వైద్యుడు తన యూరాలజీ క్లీనిక్ పబ్లిసిటీ కోసం వాడేశారు. ఇందులో భాగంగా.. మోడీ చెప్పిన ఆ విషయాన్ని యూరాలజిస్ట్ శివేంద్ర సింగ్ తివారీ... సోషల్ మీడియాలో తన క్లీనిక్ కోసం ప్రమోషనల్ పోస్ట్ పెట్టారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని సింధూ నదీ జలాలు, పాక్ లో ఉగ్రవాదుల విషయంలో ప్రధాని వాడితే.. యూరాలజీ ప్రాబ్లం కోసం తివారీ వాడారు!
ఇందులో భాగంగా... "నీరు నెత్తురు కలిసి ప్రవహించలేవు అని ప్రధాన మంత్రి అన్నారు. అందువల్ల.. మీ మూత్రంలో రక్తం కనిపిస్తే వెంటనే యూరాలజిస్టును సంప్రదించండి. ఇది తీవ్రమైనది కావొచ్చు" అని ప్రకటనలో రాసుకొచ్చి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు! దీంతో... నెటిజన్లు ఒక ఆటాడేసుకుంటున్నారు! వాడకం అంటే ఈ యూరాలజిస్టుదే అంటూ స్పందిస్తున్నారు.
ఈ తెలివితేటలతో డాక్టర్ ఎలా అయిపోయావు గురూ అని ఒకరంటే.. ఈ డాక్టర్ కి మార్కెటింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి, బహుశా ఎంబీయే మార్కెటింగ్ డిస్టెన్స్ లో చదువుతున్నారేమో అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే... ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సీరియస్ గా స్పందించారు. ఈ పనికి పూనుకున్నందుకు డాక్టర్ శివేంద్ర సింగ్ తివారీని 15 రోజులపాటు సస్పెండ్ చేశారు.