ఢిల్లీ బాంబు పేలుడు వెనక సంచలన విషయాలు
ఈ భారీ బాంబ్ బ్లాస్ట్ ని చూస్తూ మొత్తం పరిణామాలను అంచనా వేస్తున్న నిపుణులు భావిస్తున్నది ఏమిటి అంటే ఇది ఒత్తిడితోనో లేక తొందరపడి చేసిన దాడిగానే అంటున్నారు.
By: Satya P | 11 Nov 2025 10:58 PM ISTసోమవారం రాతి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ బాంబు పేలుడు మారణ హోమం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది దీని వెనక ఎవరు ఉన్నారు, దేని కోసం చేశారు ఇలాంటి విషయాల మీదనే అందరి దృష్టి ఉంది. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ లో పన్నెండు మంది దాకా చనిపోయారు. అనేక మంది తీవ్ర గాయాల పాలు అయ్యారు. అయితే ఆదివారం కనుక ఈ తరహా బాంబ్ బ్లాస్ట్ జరిగి ఉంటే కనుక పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించి ఉండేది అన్నది వాస్తవం. ఇదే మాటను అంతా అనుకున్నారు. సోమవారం ఎర్ర కోట సందర్శనకు సెలవు కావడంతో చాలా ప్రాణ నష్టం తప్పింది అని కూడా అనుకున్నారు.
సూసైడ్ ఎటాక్ కాదా :
ఇదిలా ఉంటే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తీరుని పరిణామాలను అన్నీ బేరీజు వేసుకుంటూ లోతైన దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థలు ఒక విషయంలో కొంత మేర నిర్ధారణకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అదేంటి అంటే మొదట అనుకున్నట్లుగా ఇది సూసైడ్ ఎటాక్ అయితే కాదని, అంటే ఆత్మాహుతి దళంగా మారి చేసే దాడి అన్న మాట. నిజంగా అంతలా ప్రిపేర్ అయి వస్తే మాత్రం భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగేది అని అంటున్నారు. కానీ ఇక్కడ జరిగింది కొంత భిన్నంగా ఉందని దాంతోనే పెద్ద ముప్పు తప్పిపోయిందని అంటున్నారు.
ఒత్తిడి కారణమా :
ఈ భారీ బాంబ్ బ్లాస్ట్ ని చూస్తూ మొత్తం పరిణామాలను అంచనా వేస్తున్న నిపుణులు భావిస్తున్నది ఏమిటి అంటే ఇది ఒత్తిడితోనో లేక తొందరపడి చేసిన దాడిగానే అంటున్నారు. ఆ మేరకు దర్యాప్తు సంస్థలు ఒక అంచనాకు వస్తున్నట్లుగా చెబుతున్నారు. దేశంలో ఒక వైపు ఉగ్రవాద లింకుల మీద వాటితో అనుసంధానం అయిన వారి మీద వ్యక్తులు సంస్థల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది ఉగ్ర వాద వ్యతిరేక సంస్థ. అధికారులు అయితే ఇదే పని మీద గత కొద్ది రోజులుగా బిజీగా ఉండడమే కాదు, లోతుల్లోకి వెళ్లి మరీ ఉగ్ర మూలాలను పెకిలించి వేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఉగ్ర వాదులతో కనెక్షన్లు ఉన్న వారు అంతా చెల్లా చెదురు అవుతున్నారు.
రొటీన్ ఫార్ములా కాదు :
ఈ నేపధ్యంలో ఢిల్లీలో జరిగిన కారు బాంబు బ్లాస్టింగ్ లో నిందితుడు రెగ్యులర్ ఫార్ములాను వాడలేదని అలా కనుక చేస్తే భారీ ముప్పు జరిగి ఉండేదని అంటున్నారు ఒత్తిడి వల్ల తాను దొరికిపోతాను అన్న కంగారు వల్లనే ఈ విధంగా చేసి ఉండొచ్చు అని ప్రాధమిక అంచనాల మేరకు భావిస్తున్నారు. అంతే కాదు ఇంటెన్షన్ తో దేనినీ ఢీ కొట్టలేదని అంతే కాదు పూర్తిగా డెవలప్ కాని బాంబుని వాడడం వల్లనే తీవ్రత అయితే బాగా తగ్గింది అని అంటున్నారు. ఏది ఏమైనా ఉగ్ర లింకులు ఉన్న నిందితుడే ఈ పని చేశారు అన్నది వాస్తవం అని చెబుతున్నారు. దాంతో దీని వెనక ఏమి జరిగింది అన్నదే ఇపుడు కీలకంగా మారబోతోంది.
