చిత్తూరు రాజకీయాల్లో చిత్రాలు.. విషయం ఇదీ..!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయాలు చిత్రంగా మారాయి. ఇక్కడ వైసీపీ డోలాయమానంలో పడి.. టీడీపీ, జనసేనలు పుంజుకున్నాయి.
By: Tupaki Desk | 24 April 2025 7:30 AMఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయాలు చిత్రంగా మారాయి. ఇక్కడ వైసీపీ డోలాయమానంలో పడి.. టీడీపీ, జనసేనలు పుంజుకున్నాయి. దీంతో సహజంగానే టీడీపీ, జనసేన నాయకులు దూకుడుగా ఉంటారని అనుకుంటారు. కానీ, దీనికి భిన్నంగా.. జిల్లా రాజకీయాలు కొనసాగుతున్నాయి. అదేసమయంలో వైసీపీ నాయకులు కూడా ఎవరికి వారే అన్నట్టుగా తయారయ్యారు. పలితంగా చిత్తూరు రాజకీయాలు చిత్రంగా మారాయి.
వైసీపీ విషయాన్ని తీసుకుంటే.. తిరుపతి ఎంపీ స్థానాన్ని వైసీపీ దక్కించుకుంది. అదేవిధంగా పుంగనూ రులోనూ పాగావేసింది. కానీ,.. నాయకులు మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు. ఒకరితో ఒకరికి సంబంధమే లేదు. పైగా అందరూ జగన్కు కావాల్సిన వారే కావడం గమనార్హం. తిరుమల విషయంలో భూమన కరుణాకర్రెడ్డి పెద్ద దుమారం రేపారు. కానీ, వైసీపీ నుంచి నాయకులు ఎవరూ ఆయనకు మద్దుతుగా నిలవలేదు. ఇది జిల్లాలో చర్చకు దారితీసింది.
టీడీపీ పరిస్థితిని తీసుకుంటే.. పైకి బాగున్నా.. అంతర్గత కుమ్ములాటతో తమ్ముళ్లు అలుపెరుగని రాజకీ యాలు చేస్తున్నారు. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి స్థానాన్ని మరొకరు భర్తీ చేయాలని కోరుకుంటారు. ఇక, చంద్రబాబు వస్తున్నారని తెలిస్తే మాత్రం అంతా చేతులు కలిపేస్తారు. ఆయన అటు వెళ్లగానే ఇటు మూతులు ముడుస్తున్నారు. జనసేనలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేల మాట నాయకులకు లెక్కలేదు. నాయకులు చెప్పింది.. ఎమ్మెల్యేలు వినిపించుకోరు.
చిత్తూరు అంటే.. చంద్రబాబుకు సొంత జిల్లా కావడంతోదీనిపై ఎక్కువగానే ఫోకస్ చేస్తున్నారు. పెట్టుబడు లు ఆకర్షిస్తున్నారు. ఉన్న పరిశ్రమలను పెంచుతున్నారు. ఈనేపథ్యంలో జిల్లాలో మరింత అభివృద్దికి.. పార్టీ పుంజుకునే పరిస్థితికి అవకాశం ఉంది. అయినప్పటికీ.. నాయకులు ఎవరూ పట్టించుకుంటున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే.. కొన్నాళ్ల పాటు పరిస్థితి ఇలానే ఉంటుందన్న వాదనా వినిపిస్తోంది. కొంత అసంతృప్తులు కూడా దీనికి కారణమని చెబుతున్నారు.