డ్రాగన్ కుట్ర : పాకిస్తాన్ కు చైనా అత్యాధునిక J-35A స్టెల్త్ యుద్ధవిమానాలు
ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా తన వ్యూహాత్మక భాగస్వామి అయిన పాకిస్తాన్కు రక్షణపరంగా అండగా నిలుస్తోంది.
By: Tupaki Desk | 21 May 2025 9:29 AM ISTఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా తన వ్యూహాత్మక భాగస్వామి అయిన పాకిస్తాన్కు రక్షణపరంగా అండగా నిలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, చైనా తన ఐదవ తరం స్టెల్త్ యుద్ధవిమానాలైన J-35A లను తక్కువ సమయంలోనే పాకిస్తాన్కు అందించనుంది.
ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా అసిఫ్, ఉన్నత స్థాయి దౌత్య వర్గాల సమాచారం మేరకు, 2025 ఆగస్టు నాటికి పాకిస్తాన్కు తొలి 30 J-35A యుద్ధవిమానాల బ్యాచ్ అందజేయబడుతుంది. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారానికి ఎంతటి ప్రాధాన్యతనిస్తుందో స్పష్టం చేస్తుంది.
చైనా ఈ యుద్ధవిమానాలను పాకిస్తాన్కు 50 శాతం రాయితీతో ఇవ్వడమే కాకుండా, సులభ చెల్లింపు సౌకర్యాలను కూడా అందిస్తోంది.
2024 చివర్లో వెలువడిన నివేదికల ప్రకారం, పాకిస్తాన్ మొత్తం 40 J-35A యుద్ధవిమానాలను కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం చైనా నుండి మొదటి ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ ఎగుమతిగా చరిత్రలో నిలవనుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన పైలట్లను బీజింగ్లోని చైనా విమాన దళం ప్రధాన కార్యాలయానికి పంపించి, J-35A ప్లాట్ఫారంపై శిక్షణను ప్రారంభించారు. ఇది పాకిస్తాన్ ఐదవ తరం వైమానిక సామర్థ్యాల దిశగా చేస్తున్న పురోగతికి నిదర్శనం.
రక్షణ ఒప్పందానికి అదనంగా చైనా పాకిస్తాన్లో పౌర , సైనిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి $25 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. ఇది చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC) రెండో దశలో భాగంగా ఉంటుంది. గ్వాదర్ పోర్ట్కు మరింత సులభమైన ప్రవేశం కల్పించేందుకు, పాకిస్తాన్ పూర్తిస్థాయి భద్రతను హామీ ఇచ్చింది.
ఈ విధంగా, చైనా-పాకిస్తాన్ మధ్య బలపడుతున్న రక్షణ , ఆర్థిక సంబంధాలు, దక్షిణాసియా భద్రతా సమీకరణాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముంది. ప్రాంతీయ సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొనే దిశగా ఈ రెండు దేశాలు దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
