Begin typing your search above and press return to search.

సంగారెడ్డిలోని ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. డైరెక్టర్ సహా ఆరుగురు మృతి!

సంగారెడ్డిలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరిందని తెలుస్తుంది

By:  Tupaki Desk   |   3 April 2024 5:02 PM GMT
సంగారెడ్డిలోని ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. డైరెక్టర్ సహా ఆరుగురు మృతి!
X

సంగారెడ్డిలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరిందని తెలుస్తుంది. వీరిలో ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఆ ఫ్యాక్టరీ డైరెక్టర్ కూడా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ ముగ్గురు మృతుల పేర్లు డైరెక్టర్ రవి, కార్మికులు దయానంద, సుబ్రహ్మణ్యం అని అంటున్నారు.

అవును... సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో బుధవారం సాయంత్రం రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో మొత్తం ఆరుకు చేరగా.. వారిలో ముగ్గురు ప్రమాధం జరిగిన ప్రాంతంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో మరో 10 మంది కార్మికులు కూడా గాయపడ్డలు చెబుతున్నారు. ప్రమదం జరిగిన సమయంలో ఆ పరిశ్రమల్లో సుమారు 50 మంది కార్మికులు డ్యూటీలో ఉన్నట్లు తెలుస్తోంది!

రోజువారీలాగే బుధవారం కూడా కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా.. ఒక్కసారిగా భారీ శబ్ధంతో రియాక్టర్ పేలిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఇలా రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని.. అదే ఈ భారీ అగ్నిప్రమాదానికి కారణం అయ్యిందని అంటున్నారు. దీంతో... విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు!

ఇక ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని సంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రియాక్టర్ పేలడంతో దానికి సమీపంలో ఉన్న కార్మికులు ఒక్కసారిగా ఎగిరి దూరంగా పడ్డారని తోటి కార్మికులు చెబుతున్నారు. ఈ పేలుడు ధాటికి పక్కనే ఉన్న పలు నిర్మాణాలు కూలిపోయినట్లు వెల్లడిస్తున్నారు. ఈ సమయంలో.. ఫ్యాక్టరీ సమీపంలోని ఇళ్లల్లో ఉన్న ప్రజలను అధికారులు ఖళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు!

ఇక ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని సంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. రియాక్టర్ పేలడంతో దాని పక్కనే ఉన్న కార్మికులు ఒక్కసారిగా ఎగిరి దూరంలో పడ్డారని అక్కడే ఉన్న తోటి కార్మికులు వెల్లడించారు. అయితే ఆ రియాక్టర్ పక్కనే మరో రియాక్టర్ ఉందని అది కూడా పేలే ప్రమాదం ఉందని ఫ్యాక్టరీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదే సమయంలో... రియాక్టర్ పేలుడు ధాటికి పక్కనే ఉన్న పలు నిర్మాణాలు కూలిపోయినట్లు తెలిపారు! ఈ క్రమంలోనే ఎస్బీ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న ఇళ్లల్లో ఉన్న ప్రజలను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా... ఘటనా స్థలానికి చేరుకున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్, పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి లతోపాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పరిశీలించారు!

ఇదే సమయంలో ఈ కెమికల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో... సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చార్యలను పర్యవేక్షించాలని ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డిని ఆదేశించారు!