Begin typing your search above and press return to search.

అదొక బ్యాడ్ పిరియడ్...బాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం చంద్రబాబు చంద్రబాబు విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన సీఐఐ సదస్సులో అంతా తానై వ్యవహరించారు.

By:  Satya P   |   15 Nov 2025 9:22 PM IST
అదొక బ్యాడ్ పిరియడ్...బాబు సంచలన వ్యాఖ్యలు
X

ఏపీ సీఎం చంద్రబాబు చంద్రబాబు విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన సీఐఐ సదస్సులో అంతా తానై వ్యవహరించారు. పెద్ద ఎత్తున సెషన్లు నిర్వించారు. అలాగే ఒప్పందాలు కూడా ఎన్నో కుదిరాయి. ఇక రాత్రీ పగలు తీరిక లేకుండా బాబు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు వేశారు. విశాఖలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సందర్భంగ మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేసారు.

ఆ అయిదేళ్ళూ అంటూ :

మొత్తం ఏపీ చరిత్రలో ఒక అయిదేళ్ళ కాలం మాత్రం బ్యాడ్ పీరియడ్ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు 19-24 ఓ బ్యాడ్ పిరియడ్ గా చరిత్రలో ఉంటుందని ఆయన అన్నారు. ఒక వైపు పరిశ్రమల్ని మూసివేయించారు అంతే కాదు చాలా వరకూ ఏపీ నుంచి తరిమేశారు అని ఆయన విమర్శించారు. అంతే కాదు మరో వైపు విద్యుత్ పీపీఏలను రద్దు చేసేసి ఏపీ బ్రాండ్ ను దెబ్బతీశారు అని వైసీపీ మీద తీవ్రంగానే విమర్శలు చేశారు ఏపీలో ఆనాటి పరిస్థితుల మీద ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలియచేసిన పరిస్థితి నెలకొంది అని ఆయన అన్నారు. ఇక గత పాలకులు చేసిన తప్పుల కారణంగా విద్యుత్ ఒప్పందాల వల్ల అనవసరంగా కరెంటు వాడుకోకుండానే తొమ్మిది వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది అని ఆయన ఎత్తి చూపించారు.

అంతా సెట్ చేశాం :

అయితే ఆ బ్యాడ్ పీరియడ్ నుంచి పుట్టుకొచ్చిన వాటిని తట్టుకుంటూ ఆ వ్యవహారాలన్నిటినీ కేవలం పద్దెనింది నెలల్లోనే సరి చేయగలిగామని ఆయన చెప్పారు. గ్రీన్ ఎనర్జీ లేకపోతే గూగుల్ డేటా సెంటర్ రాదు అలా ఏపీలో ఎకోసిస్టం తయారైంది కాబట్టే మరో నాలుగైదు డేటా సెంటర్లు ఏర్పాటుకు ముందుకు వచ్చాయని ఆయన వివరించారు. అంతే కాదు అనేకమైన అనుబంధ పరిశ్రమలు ఏపీకి తరలి విశాఖకు తరలివస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

పెట్టుబడులకే కాదు :

ఇక సీఐఐ సదస్సు కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే కాదు. మేధోపరమైన చర్చలకు, వినూత్న ఆవిష్కరణల్ని పంచుకునేందుకు కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తాను దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తల్ని అదే విధంగా మేధావుల్ని, విదేశీ ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించామని ఆయన తెలిపారు అంతే కాకుండా ఒక 500 మంది విద్యార్ధులను సెలెక్ట్ చేసి ఈ సీఐఐ సదస్సుకు ఆహ్వానించామని తెలిపారు వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమని చెప్పారు. రానున్న కాలంలో ఆస్పిరెంట్ ఇండస్ట్రియలిస్ట్స్ గా వారిని మార్చే అవకాశం ఉంటుందని చెప్పారు.

యువత ఆలోచనలు మారాలి :

ఈ తరహా సదస్సుల ద్వారా యువత ఆలోచనలు మారాలన్నది కూడా ప్రభుతం ఉద్దేశ్యమని బాబు చెప్పారు. యువత, విద్యార్ధుల ఆలోచనలకు ఈ సదస్సు ఒక వేదిక కావాలన్నదే ప్రభుత్వం ఉద్దేశంగా చంద్రబాబు చెప్పారు. ఇక ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి పరిశ్రమలకు కేటాయిస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ పారిశ్రామిక పార్కుల్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

పోటీ పడి పెట్టుబడులు :

ఇక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు అని ఆయన చెప్పారు. అలాగే ఈజ్ నుంచి గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చామని అన్నారు. ఈ ప్రయత్నంలో సింగపూర్ ను ఒప్పించి మళ్లీ రాష్ట్రానికి తీసుకువచ్చామని, అమరావతి రాజధానిలో భాగస్వామి కాకపోయినా ఇతర ప్రాంతాల్లో కలిసి పనిచేసేలా సింగపూర్ ని ఒప్పించామని బాబు చెప్పుకొచ్చారు అదే విధంగా చూస్తే కనుక 21 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గత 18 నెలల్లో వచ్చాయని అలాగే వీటి ద్వారా 17 లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయని బాబు వెల్లడించారు.

ఎస్క్రో ఖాతాతో :

ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు విశ్వాసం కల్పించాలనే దేశంలో ఎక్కడా లేనట్టుగా ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేస్తున్నామని కొత్త విషయాన్ని బాబు చెప్పారు. దీనికి సావరిన్ పవర్ ను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 10 ఏళ్లలో 1 ట్రిలియన్ డాలర్లు కోటిమందికి ఉద్యోగాలు తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బాబు అన్నారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది దీనిని మళ్లీ పునరుద్ధరించుకోవాలని ఆయన అంటున్నారు. అలాగే గుడ్ గవర్నెన్సు డెవలప్మెంట్ పై శ్రద్ధపెడతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని మరో మారు చంద్రబాబు గుర్తు చేశారు.