అమిత్ షాతో గంటన్నర పాటు బాబు భేటీ...మ్యాటర్ సీరియస్ ?
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఆయన ఆయన గురువారం రాత్రికి ఢిల్లీ చేరుకున్నారు.
By: Tupaki Desk | 23 May 2025 2:33 PMముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఆయన ఆయన గురువారం రాత్రికి ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం అంతా వరసబెట్టి కేంద్ర మంత్రులతో భేటీలు వేస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బాబు భేటీ మీద అంతా ఫోకస్ పెడుతున్నారు.
అమిత్ షాతో బాబు ఏకంగా గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఇది ఒక విధంగా చెప్పాలీ అంటే సుధీర్ఘమైన భేటీ అని అంటున్నారు. ఈ భేటీలో దేని గురించి చర్చించారు అన్న దాని మీద రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేశంలో అత్యంత శక్తివంతుడైన రాజకీయ నాయకుడిగా హోం మంత్రిగా అమిత్ షా ఉన్నారు.
ఆయన చేతిలోనే సీబీఐ ఈడీ వంటి విచారణ సంస్థలు ఉన్నాయి. ఏపీలో చూస్తే వైసీపీ హయాంలో జరిగినందని చెబుతూ లిక్కర్ స్కాం మీద కూటమి ప్రభుత్వం వచ్చాక దర్యాప్తు చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ కేసులో విచారణ సాగుతోంది. ఇప్పటిదాకా చూస్తే అనేక మంది ఈ కేసులో అరెస్టు అయ్యారు. జగన్ కూడా లిక్కర్ స్కాం లో అరెస్ట్ అవుతారని ప్రచారం సాగుతోంది.
దాని మీద మీడియా జగన్ ని ప్రశ్నించగా తాను విజయవాడలోనే ఉన్నాను. వెల్ కం అనేశారు. ఎవరైనా అడ్డుకుంటారా అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. అంటే జగన్ వైపు నుంచి చూస్తే తన అరెస్ట్ విషయంలో ఆయన మానసికంగా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.
పైగా తనకు అరెస్టులు కొత్త కాదని కూడా చెప్పారు. లిక్కర్ స్కాం అన్నదే జరగలేదని కేవలం రాజకీయ వేధింపులతోనే ఇదంతా చేస్తున్నారు అని ఆయన అన్నారు ఇక చూస్తే మహనాడు ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు జగన్ సొంత జిల్లా కడపలోని కమలాపురంలో జరుగుతోంది.
రాజకీయంగా వైసీపీని దెబ్బ తీసేందుకు అక్కడ మహానాడుని నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. ఈ క్రమంలో మహనాడు కంటే ముందే జగన్ అరెస్ట్ ఉంటుందని ఈ మధ్యనే ఒక ప్రచారం అయితే సాగుతోంది. అలా కాదు మహానాడు తర్వాత అని మరో ప్రచారం కూడా ఉంది.
మొత్తానికి జగన్ అరెస్టుకు రంగం సిద్ధం చేశారని ముహూర్తం కూడా ఖరారు చేశారని అంటున్నారు. అయితే జగన్ అరెస్ట్ ని కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ చేస్తుందా లేక సిట్ చేస్తుందా అన్నది మరో చర్చగా ఉంది. కేంద్రానికి కూడా జగన్ అరెస్ట్ విషయాన్ని చెప్పి వారి నుంచి కూడా సమ్మతి తీసుకోవాలని టీడీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దాంతోనే చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ఇది అతి ముఖ్యమైన అంశం అని అంటున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు ఢిల్లీలో ఎందరు కేంద్ర మంత్రులను కలసినా హోంమంత్రి అమిత్ షాతో భేటీకి రాజకీయ ప్రత్యేకత ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే అమిత్షాతో చంద్రబాబు భేటీ గంటన్నర పాటు సాగిందని అంటున్నారు. ఈ భేటీలో కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై సమీక్ష చేశారు అని అంటున్నారు. అలాగే ఏపీ అభివృద్ధి పైనా కార్యక్రమాల చర్చ సాగింది అని అంటున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే ఏపీలో వర్తమాన రాజకీయ పరిస్థితులపైనా చర్చ సాగింది అని అంటున్నారు. అందులోనే జగన్ ప్రభుత్వంలో లిక్కర్ స్కాం విషయం కూడా ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చు అని అంటున్నారు. అలాగే జగన్ అరెస్ట్ విషయం మీద చర్చ సాగి ఉండవచ్చు అని అంటున్నారు. ఇక జగన్ కూడా బాబు ఢిల్లీ టూర్ కంటే ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి లిక్కర్ స్కాం ఏమీ జరగలేదు అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇది కూడా కేంద్ర పెద్దల దృష్టిలో ఉండాలని ఉంటుందని భావించే అలా చేశారు అని అంటున్నారు. మరి చంద్రబాబు అమిత్ షా భేటీలో రాజకీయంగా ఏమి చర్చించి ఉంటారు అన్నది ఇపుడే తెలిసే అవకాశం లేదు కానీ తొందరలో జరిగే చర్యల ద్వారానే ఆ మ్యాటర్ ఏంటి అన్నది తెలుస్తుంది అని అంటున్నారు. అందువల్ల చూడాలి మరి ఏమి జరుగుతుందో.